కొమురవెల్లి, జూలై 23: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వేస్టేషన్లో చేపట్టిన ఏర్పాట్లను గురువారం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించారు. స్టేషన్లో ముగిసిన పనులు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పార్కి ంగ్, తాగునీరు, విద్యుత్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి పలు చూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీపీఆర్వో శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల 26న కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. ప్రారంభోత్సవానికి హాజరయ్యే వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఏడీఆర్ఎం కేఎస్ రామారావు, సీనియర్ డీఈఎన్ ప్రసా ద్, సీనియర్ డీసీఎం అనిరుధ్, ఏఎస్సీ రవిశర్మ, సీనియర్ డీవోఎం విద్యాధర్, సీనియర్ డీఎస్టీ సుజన్కుమార్, సీపీఆర్ఐ శైలేందర్, చేర్యాల సీఐ రమేశ్నాయక్, కొమురవెల్లి ఎస్సై మహేశ్ పాల్గొన్నారు.