న్యూఢిల్లీ : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్కు ప్రజలు ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని, ముఖ్యంగా విద్యావంతులైన మధ్య తరగతి వారి నిర్లక్ష్యం వల్లనే వ్యాప్తి చెందుతున్నదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీఎం కటోచ్ స్పష్టం చేశారు. కరోనా ఇన్ఫెక్షన్ను నివారించడంలో గత ఏడాది వీరు చాలా నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఈ పరిస్థితులు దాపురించాయన్నారు.
‘టీకా అనేది మంత్రదండం కాదు. అలా టీకా ఇవ్వగానే ఇలా వైరస్ అదృశ్యం కాదని అర్థం చేసుకోవాలి. టీకా రక్షణ కవచాన్ని ఇస్తుంది. ఇది కరోనా వైరస్ ఇన్ఫెక్షణ్ తీవ్రత నుంచి రక్షిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, సాధారణ ప్రజలతో సన్నిహితంగా ఉండే ఫ్రంట్లైన్ కార్మికులకు ఇది చాలా ముఖ్యం. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం మొదట వారికి టీకాలు వేసింది’ అని కటోచ్ చెప్పారు.
‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా మనుషుల ప్రాణాలను కాపాడుతుంది. అయితే రెండు రోజుల్లో 140 కోట్ల మందికి టీకాలు వేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది. అలా వేస్తేగానీ చైన్ను తెంపగలం. టీకా పాత్ర ప్రస్తుతం పరిమితం. ఈ రోజు ప్రజలు కరోనా వైరస్ నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటే, 20-25 రోజుల్లోపు కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతుంది. అయితే దీని కోసం కరోనాకు సంబంధించిన చర్యలను మనం ఖచ్చితంగా పాటించాలి’ అని డాక్టర్ కటోచ్ పేర్కొన్నారు.
రంగురంగుల్లో టీవీ ప్రసారాలు.. చరిత్రలో ఈరోజు
భవిష్యత్తులోనూ ఉచిత టీకా కార్యక్రమం: ప్రధాని మోదీ
కరోనాపై గెలిచాం.. పండుగ చేసుకుంటున్న న్యూజిలాండ్
ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. భారత్కు అత్యవసర మందులు, వ్యాక్సిన్లు