కవాడిగూడ, జూలై 23ః ఢిల్లీలో జరుగుతు న్న కేంద్ర అరాచకాలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్య త వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని , సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఈ.టి. నర్సింహ, శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్, హేమంత్రావు, వి.ఎస్.బోస్, ఎమ్మె ల్సీ నెల్లికంటి సత్యం, బొమ్మగాని ప్రభాకర్, పాలమాకుల జంగయ్య, అందోజు రవీంద్రాచారి, జ్యోతి, ఎస్.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఢిల్లీ ఘటనపై విచారణ చేయాలని ఒకరు ఢిల్లీ హైక్టోర్టుకి వెళ్తే విచారణ చేయకుండా ఆ ఘటనలతో తమకు సంబంధంలేదని తమను భాగస్వాములను చేయొద్దని చెప్పడం, మరొకరు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇటువంటి వాటితో తమ సమయాన్ని వృధా చేయొద్దని, మీ సమయం వృధా చేసుకోవద్దని, ఇది మాకు సంబంధంలేని అంశం అని చెప్పడం విచారకరమన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం నీట్ పరీక్షలను నిర్వహిస్తోందన్నారు.