కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ పోస్టుపై జరిగిన దాడిలో ఐదుగురు తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఎనిమిది మంది ఉగ్రవాదులు గాయపడ్డారు. బాద్షా ప్రావిన్స్లోని షాహర్-ఎ-జోర్గ్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ వార్తలను ఆఫ్ఘాన్కు చెందిన ప్రావిన్షియల్ పోలీసులు ధ్రువీకరించారు. ఆఫ్ఘాన్ ఆర్మీ పోస్టుపై శనివారం రాత్రి దాడి జరిగింది. కొన్ని గంటలపాటు బాంబుల వర్షం కురిసింది. ఈ దాడిలో ఐదుగురు తాలిబాన్ ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
మే 1 వ తేదీలోగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి విదేశీ దళాలను ఉపసంహరించుకోకపోతే దాడులు ప్రారంభిస్తామని తాలిబాన్ ఉగ్రవాదులు బెదిరించిన విషయం తెలిసిందే. అయితే, సెప్టెంబర్ 11 నాటికల్లా తమ బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనకు తాలిబాన్ ఉగ్రవాదులు ససేమిరా అంటున్నారు. ట్రంప్ హయాంలో తమతో చేసుకున్న ఒప్పందం మేరకు మే 1 న అమెరికా తమ దళాలను ఉపసంహరించుకోవాలని తాలిబాన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా దళాలు ఆఫ్ఘాన్ నుంచి వెళ్లపోయేట్లు చేసేందుకు ఆర్మీ పోస్టుపై దాడికి తెగబడినట్లుగా తెలుస్తున్నది. ఈ దాడి రివర్స్ అయి ఐదుగురు ఉగ్రవాదులు మరణించారని, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు ఆఫ్ఘాన్ పత్రికలు తెలిపాయి.
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
విద్యావంతులైన మధ్యతరగతి వారి నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్: డాక్టర్ కటోచ్
రంగురంగుల్లో టీవీ ప్రసారాలు.. చరిత్రలో ఈరోజు
భవిష్యత్తులోనూ ఉచిత టీకా కార్యక్రమం: ప్రధాని మోదీ
కరోనాపై గెలిచాం.. పండుగ చేసుకుంటున్న న్యూజిలాండ్
ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. భారత్కు అత్యవసర మందులు, వ్యాక్సిన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..