సిమ్లా : దేశంలోనే అతి ఎత్తైన క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని లాహాల్ స్పితి జిల్లాలో దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. 10,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన ఈ స్టేడియం రోహ్తంగ్లోని అటల్ టన్నెల్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిసు వద్ద నిర్మించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని సోలన్ జిల్లాలోని చైల్లో ఉన్న క్రికెట్ స్టేడియం 7,500 అడుగుల ఎత్తులో ఉన్నది. దీనిని 1891 లో పాటియాలాకు చెందిన మహారాజా భూపేంద్ర సింగ్ నిర్మించారు.
సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో నిర్మించనున్న ఈ స్టేడియం నిర్మాణానికి 38 బిగాల భూమిని ఎంపిక చేశారు. ఈ భూమిని అటవీ సంరక్షణ చట్టం (ఎఫ్సీఏ) కింద అనుమతి కోసం డెహ్రాడూన్కు పంపించారు. తద్వారా భూమిని స్టేడియంకు బదిలీ చేయగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.
లాహాల్ స్పితి జిల్లా క్రికెట్ అసోసియేషన్ గత ఏడు సంవత్సరాలుగా ఈ స్టేడియం నిర్మించడానికి చాలా కష్టపడుతోంది. లాహౌల్-స్పితితో పాటు చంబా పాంగి కిల్లాడ్, కులు, మండి ప్రాంతాలకు చెందిన క్రికెటర్లకు ఈ స్టేడియం ప్రయోజనం చేకూరుస్తుంది.
శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్కు చేరుతుంది. వేసవిలో ఇక్కడ సాధారణంగా 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక్కడి వాతావరణం సంవత్సరంలో 7 నెలలు అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి వాతావారణం క్రికెట్కు మంచిదైనందున ఇక్కడ స్థలం ఎంపిక చేసినట్లు లాహాల్-స్పితి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్ర ఠాకూర్ చెప్పారు.
విద్యావంతులైన మధ్యతరగతి వారి నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్: డాక్టర్ కటోచ్
రంగురంగుల్లో టీవీ ప్రసారాలు.. చరిత్రలో ఈరోజు
భవిష్యత్తులోనూ ఉచిత టీకా కార్యక్రమం: ప్రధాని మోదీ
కరోనాపై గెలిచాం.. పండుగ చేసుకుంటున్న న్యూజిలాండ్
ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. భారత్కు అత్యవసర మందులు, వ్యాక్సిన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..