సరిగ్గా 35 ఏండ్ల క్రితం 1986 ఏప్రిల్ 26న కొన్ని సెకన్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం సంభవించింది. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో 1986 ఏప్రిల్ 25 అర్ధరాత్రి దాటాక 1:23 గంటలకు విద్యుత్ సరఫరా ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు చేపట్టిన ప్రయోగం విఫలమవడంతో ఇది తలెత్తింది. చెర్నోబిల్ ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగమైన ప్రస్తుత ఉక్రెయిన్ ఉత్తర ప్రాంతంలో ఉన్నది.
అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో నంబరు రియాక్టర్లో కొన్ని వ్యవస్థలకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. కరెంటు సరఫరా నిలిపేయడంతో రియాక్టర్కు కూలింగ్ వాటర్ను పంపే టర్బైన్లు నెమ్మదించాయి. కూలింగ్ వాటర్ సరఫరా తగ్గిపోయింది, అదే సమయంలో రియాక్టర్లో ఆవిరి కారణంగా పీడనం పెరిగిపోయి పేలిపోయాయి. విద్యుత్ కేంద్రంలోని ఇద్దరు చనిపోయారు. బయటి వాతావరణంలోని గాలి కారణంగా మంటలు పది రోజుల పాటు కొనసాగాయి. ప్రమాదం అనంతరం సమీప ప్రాంతాల నుంచి దాదాపు లక్షా 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని నెలల తర్వాత 2.34 లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు.
రేడియోధార్మికత వల్ల 134 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 28 మంది కొన్ని నెలల్లోనే చనిపోయారు. ఆ తర్వాత మరో 19 మంది మరణించారు. చెర్నోబిల్ నుంచి వెలువడిన రేడియో ధార్మికతతో కూడిన పొగ, వ్యర్థాలు గాల్లో కలిసిపోయి ఐరోపా వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించాయి. దాంతో ఆ ప్రాంతాన్ని సురక్షితంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల్లో ఉన్న భయాన్ని పొగొట్టేందుకు ఉక్రెయిన్ చర్యలు చేపట్టింది. ఇందుకు ‘యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్’తో పాటు అనేక సంస్థలు, దేశాలూ సాయం అందించాయి. పేలిన రియాక్టర్ నుంచి రేడియేషన్ వెలువడకుండా అడ్డుకునేందుకు ఆ రియాక్టర్ను భారీ నిర్మాణంతో కప్పివేశారు.
ఇప్పుడు చెర్నోబిల్ ప్రాంతం సురక్షితమేనని ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది. పర్యాటకులు ఎలాంటి భయమూ లేకుండా ఇక్కడి ప్రకృతి అందాల్ని ఆస్వాదించొచ్చని, ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పుడది ఆ దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల జాబితాలో చేరిపోయింది.
2010: బిహార్లోని ప్రసిద్ధ చినియా అరటిని ‘గంగా అరటి’ గా ముద్రించాలని బిహార్ ప్రభుత్వం నిర్ణయం
2005: లెబనాన్లో తన సైనిక అధికారాన్ని 29 సంవత్సరాల తరువాత వదులుకున్న సిరియా
1989: బంగ్లాదేశ్లోని దౌలత్పూర్-సాతురియాలో తుఫాను కారణంగా 1,300 మంది మరణం
1962: మొదటిసారి చంద్రుడి ఉపరితలంపై దిగిన అమెరికన్ అంతరిక్ష నౌక రేంజర్ -4
1920: భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ మరణం
1929: ఇంగ్లండ్ నుంచి మొట్టమొదటి ప్రయాణాన్ని పూర్తి చేసిన నాన్ స్టాప్ విమానం
భారతదేశానికి మద్దతు తెలిపిన జర్మనీ
మూడవ దశ టీకాలకు మార్గదర్శకాలు జారీ
హిమాచల్లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
ఘజియాబాద్లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..