Ritesh Deshmukh | బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ ‘రాజా శివాజీ’ (Raja Shivaji). మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఫస్ట్ డే రికార్డు స్థాయి వసూళ్లతో మరాఠీ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. సక్పెస్ ఫుల్గా స్క్రీనింగ్ అవుతోన్న ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు రితేశ్ దేశ్ముఖ్.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్పై ఉన్న గౌరవానికి గుర్తుగా సినిమాలోని పలువురు యాక్టర్లు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా నటించారన్నాడు. ఈ మరాఠి సినిమా మహారాష్ట్రలో చాలా థియేటర్లలో విడుదలైంది. మేం చాలా పుస్తకాలు చదివాం. మహారాజ్ చరిత్ర కేవలం ఒక్క సినిమాలో చూపించేది కాదు. చరిత్రపై ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఈ సినిమాను చూపించడం మా బాధ్యత. సల్మాన్ ఖాన్ నా సోదరుడు. నా రెండు సినిమాల్లో సల్మాన్ ఖాన్ ఉన్నాడు. ఈ సినిమా కథ రాయడం కోసం నేను మూడున్నరేళ్లు పనిచేశా. ఇందులో నటించిన పెద్ద యాక్టర్లందరూ ఫ్రీగా సినిమా చేశారంటే చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో మెరిశాడు. రూ.100 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం మరాఠీలో అత్యధిక వసూళ్లు సాధించిన ‘సైరాట్’ రికార్డులను ‘రాజా శివాజీ’ తిరగరాస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.