మరికల్, మే 6 : కాంగ్రెస్కు ఓటేసి ప్రజలు గోసపడుతున్నారని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఓట్లకోసం గ్రామాల్లోకి వస్తే ఆరు గ్యారెంటీలు ఇచ్చాకే ఓటేస్తామని చెప్పాలన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు అరుణమ్మ తన కోడలు పర్ణికారెడ్డికి ఓట్లు వేయిస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో కోడలు అత్తకు ఓట్లు వేయిస్తుందని విమర్శించారు. కేసీఆర్ ప్ర భుత్వం అందించిన సంక్షేమ పథకాలే ఇస్తున్నారు తప్పా.. కొత్తగా ఎలాంటి పథకాలు అ మలు చేయడం లేదన్నారు. అత్తాకోడళ్లు ఒక్కటై అక్రమాలకు పాల్పడతారన్నారు. ధన్వాడ పెద్ద చెరువులో ఒం డ్రుమట్టిని కోడలు అమ్ముకుంటుందన్నదని.. అత్త గెలి స్తే గ్రామాల్లో బీరు, కల్లు షా పులు ఏర్పాటు చేస్తారన్నా రు.
కేసీఆర్కు ఓటెయ్యకుం డా తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించాలని కోరారు. మరికల్కు మండల కాంప్లెక్స్ భవ నం తీసుకొస్తే కమీషన్ల కోసం పనులు ఆపారని, బస్టాం డ్ అభివృద్ధిని కూడా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్రెడ్డికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. దసరా వరకే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, తర్వాత కోమటిరెడ్డి, ఉత్తమకుమార్రెడ్డి సీఎం కుర్చీ కోసం పోటీపడుతారని జో స్యం చెప్పారు. వచ్చే ఏడాది మే నెలలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలొస్తాయని.. అప్పుడు ఎస్ఆర్ రెడ్డి ఎమ్మెల్యేగా వస్తారని ధీమా వ్యక్తం చేశారు. మహిళలను మోసం చేస్తున్న రేవంత్రెడ్డి చెంప ఛెల్లుమనేలా.. కారు గుర్తుకు ఓటేసి మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీ సుజాత, మండల కోఆప్షన్ సభ్యులు మతీన్, తీలేరు సింగిల్విండో చైర్మన్ రాజేందర్గౌడ్, సంపత్కుమార్, నాయకులు హన్మిరెడ్డి, రాజవర్ధన్రెడ్డి, రామస్వామి, బసంత్, శ్రీనివాసు లు, సూరిటి చంద్రశేఖర్, తిరుపతయ్య, వివిధ గ్రామా ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కల్వకుర్తి, బీజేపీ అభ్యర్థి గద్వాలకు చెందిన వ్యక్తులు. కానీ నేను పక్కా లోకల్. ఎంతోమంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించాం. మళ్లీ అవకాశం ఇస్తే మరిన్ని అవకాశాలు కల్పిస్తాం. పార్లమెంట్లో పాలమూరు వాణి వినిపించి ప్రజలకు న్యాయం చేస్తాను. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తేవడంలో బీజేపీ.. నిధులు ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఈ ప్రాజెక్టును ప్రారంభించిం ది కేసీఆరే. ప్రజలు మరోసారి మోసపోకుండా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్న వ్యక్తి ఒకరైతే.. దేవుడిపై ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్న వ్యక్తి మరొకరు.. వీరందరికీ ఎం పీ ఎన్నికల్లో మీరే గుణపాఠం చెప్పాలి.
అచ్చంపేటరూరల్, మే 6 : బీఆర్ఎస్ నేతల ప్రచారానికి కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని నల్లమల ఏజెన్సీ లోతట్టు ప్రాంతంలో బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు గువ్వల బాలరాజు సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అందులో భాగంగా మన్నెవారిపల్లి గ్రామంలో గువ్వల బాలరాజు ప్రసంగిస్తుండగా.. యువజన కాంగ్రెస్ నాయకుడు రాహుల్రెడ్డి ఆధ్వర్యంలో కాం గ్రెస్ నేతలు పలుమార్లు ఆటంకం కలిగించారు. పోలీసులు వారించినా వినకుండా అలాగే ప్రవర్తించారు. ప్రచారాన్ని అడ్డుకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎక్కడికక్క డ ఎండగడుతామని, దాడులకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెబుతారని గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమ ప్రచారాన్ని అకారణంగా అడ్డుకుంటే మర్యాదగా ఉండదని సూచించారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షానే ఉంటామని స్పష్టం చేశారు. ప్రచారాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు.