ఎల్లారెడ్డిపేట, మే 26 : ఇటీవల మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కుమార్ భార్య రూపకు మం జూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ అందించారు. కేటీఆర్కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ముస్తాబాద్, మే 26 : మండలం లోని గన్నెవానిపల్లె పంచాయతీ పరిధిలోని నిమ్మలవాని పల్లె నిమ్మల ప్రభాకర్ రెండు నెలల క్రితం మరణించాడు. దీంతో ఏప్రిల్ 15న తెలంగాణ భవన్లో క్లెయిమ్ చేశారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ సహకారంతో మంజూరైన ఇన్సూరెన్స్ రెండు లక్షల మంజూ రు ఆర్డర్ కాపీని ప్రభాకర్ భార్య లక్ష్మికి అందించినట్లు పార్టీ మండల్యాక్షుడు బొంపెల్లి సురేందర్రావు తెలిపారు. ఇక్కడ తెలంగాణ భవ న్ ఇన్చార్జి సోమా భరత్కుమార్, శ్రీనివా స్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చీటి వెంకట నర్సింగరావు, చి ప్పలపల్లి మాజీ సర్పంచ్ దేవ య్య నాయకులున్నారు.