గద్వాల రూరల్, మే 25 : రైతులు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను డీలర్ల వద్ద కొనుగోలు చేసి రశీదులు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్కుమార్ సూచించారు. మండలంలోని చెనుగోనిపల్లి గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయశాఖ గుర్తింపు పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు సమయంలో సంబంధిత కంపెనీ లేబుల్ పరిశీలించాలని, నకిలీని అరికట్టడానికి కవర్లు అలానే పంట కాలం పూర్తయ్యే వరకు ఉంచుకోవాలన్నారు. ఎవరైనా దళారులు విత్తనాలు అమ్మితే తీసుకోవద్దని, అలా ఎవరైనా అమ్మితే సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోవింద్నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి, ఏవో ప్రతాప్, ఏఈవోలు పాల్గొన్నారు.
అలంపూర్, మే 25: రైతులు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన విత్తన కంపెనీల విత్తనాలే కొనుగోలు చేసుకోవాలని, ఆఫర్లు, అడ్వైర్టెజ్మెంట్లను చూసి పొసపోవద్దని ఏవో అనిత పేర్కొన్నారు. శనివారం మండలంలోని గుందిమల్ల, కోనేరు, అలంపూర్లో రైతులకు విత్తన కొనుగోళ్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గుర్తింపు ఉన్న అధీకృత విత్తన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తన కొనుగోలు సమయంలో తప్పనిసరిగా రసీదు పొందాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు సాయిరాం, శిరీష, కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.
అయిజ రూరల్, మే 25: రైతులు నకిలీ విత్తనాలు కొని నష్టపోవద్దని ఏవో శంకర్లాల్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని యాపదిన్నెలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన విత్తనాలను కొనుగోలు చేయాలని, రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో అరవింద్, రైతులు పాల్గొన్నారు.
మల్దకల్, మే 25 : రైతులు నాణ్యమైన విత్తనాలను డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని, విత్తన కొనుగోళ్లలో జాగ్రత్త వహించాలని ఏవో రాజశేఖర్ అన్నారు. మండలంలోని ఎల్కూర్ గ్రామంలో రైతులకు నాణ్యమైన విత్తన కొనుగోళ్లపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతు రైతులు విత్తనాలను గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, అలాగే రసీదు తీసుకోవాలని, కంపెనీ లేబుల్ పరిశీలించి కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో కిశోర్కుమార్, ఖాజాభాషా, హారిక పాల్గొన్నారు.
వడ్డేపల్లి, మే 25 : మండలంలోని జూలేకల్, కొంకలలో శనివారం ఏవో రాధ ఆధ్వర్యంలో విత్తనాల కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఏవో మాట్లాడుతూ.. లూజుగా సంచుల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయొద్దని, విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదు తీసుకోవాలని, పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా దాచుకోవాలని, వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో రవీందర్, రైతులు పాల్గొన్నారు.
పాన్గల్, మే25: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వేణు హెచ్చరించారు. మండలకేంద్రంలో ఫర్టిలైజర్స్, సీడ్స్ షాపులను శనివారం ఎస్సై వేణు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఫర్టిలైజర్ షాపుల్లోని విత్తనాల వివరాలు, స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అమ్మాలని సూచించారు. మండలంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.
అయిజ రూరల్, మే 25: విత్తన దుకాణాల డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో శంకర్లాల్ పేర్కొన్నారు. శనివారం వెంకటాపురం స్టేజీలో పెస్టిసైడ్స్, సీడ్స్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ నిల్వలను పరిశీలించారు. అనంతరం ఏవో మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని సూచించారు. ప్రభుత్వ అనుమతులు పొందిన విత్తన ప్యాకెట్లను విక్రయించాలని సూచించారు. కచ్చితంగా ఒరిజినల్ రసీదును ఇవ్వాలని చెప్పారు.
రాజోళి, మే 25 : నకలీ విత్తనాలను కొని రైతులు నష్టపోవద్దని ఏఈవో ఇబ్రహీం అన్నారు. తూర్పుగార్లపాడులో రైతులకు విత్తనాల కొనుగోలులో చేపట్టాల్సిన జాగ్రత్తలపై శనివారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు రాముడు, సైమన్, రామకృష్ణ,మద్దిలేటి, కురుమన్న, నాగన్న, రమేశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.