అయిజ/మల్దకల్/అచ్చంపేట రూరల్/ ఉప్పునుంతల/వెల్దండ, మే 25 : అయిజ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులు వీయడంతో విద్యుత్శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 50 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రి వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అచ్చంపేట మండలంలోని చెన్నారం, హజీపూర్, రాయిచేడు, సింగారం పరిసర గ్రామాల్లో శుక్రవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు వందలాది విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. చెన్నారంలోని శ్రీలలితా ఉమామహేశ్వరి జిన్నింగ్ మిల్లులో రాప్టర్లు, రేకులు ధ్వంసమై తీవ్రనష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో శుక్రవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మల్దకల్ మండలం కుర్తిరావుల చెర్వులో శుక్రవారం రాత్రి పిడుగుపడి సూ ర్యగౌడ్కు చెందిన ఆవు మృతి చెందింది.
మల్దకల్ మం డలకేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయం వద్దనున్న కాను గ చెట్టు రోడ్డుపై పడడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పునుంతల మండలంలోని రా యిచేడ్, ఫిరాట్వాన్పల్లి, సూర్యతండాల్లోనూ విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతోపాటు కోళ్ల షెడ్లు, ఇంటిపై వేసుకున్న రేకులు ఎగిరిపోయాయి. వెల్దండ మండలం చొక్కన్నపల్లిలో రైతు చంద్రారెడ్డికి చెందిన కాడెద్దు వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఉండగా పిడుగుపాటుతో మృతి చెందింది. అదే విధంగా భారీ ఈదురుగాలులకు రాచూర్, పెద్దాపూర్ తదితర గ్రామా ల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
గట్టు, మే 25 : మండల కేంద్రంలో శనివారం 5.6 మి.మీ.ల వర్షపాతం నమోదైందని ఏఎస్వో శ్రీ నివా సులు తెలిపారు. కాగా ఇంతకు ముందు కురిసిన భారీ వర్షానికి తోడు ఇప్పడు ఓ మోస్తరు వర్షం కురవడంతో పదును అలాగే ఉండిపోనున్నదని రైతులు తెలిపారు.
మక్తల్ టౌన్, మే 25 : పిడుగు పడి రైతు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చే సుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. మక్తల్ మండలం మంతన్గోడ్ గ్రామానికి చెందిన రైతు కురుమూర్తి (42) తన పొలం వద్దకు శుక్రవారం ఉదయం వెళ్లాడు. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పొలం వద్ద పిడుగు పడింది. పిడుగుపాటుకు గురై రైతు మృతి చెందాడు. పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు.