చండీగఢ్ : పెరుగుతున్న కొవిడ్ కేసులు, మరణాల మధ్య పంజాబ్ ప్రభుత్వం లాక్డౌన్ తరహా ఆంక్షలను పొడగించింది. గతంలో జారీ చేసిన ఆంక్షలు మే 15 వరకు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కారులో ప్రయాణించే సమయంలో ఇద్దరు వ్యక్తులకు మించి ఉండొద్దని, ప్రభుత్వ కార్యాలయంలో 50 శాతం సిబ్బంది పని చేస్తారని తెలిపింది. విమానాలు, రైళ్లు, రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే వారికి తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలని స్పష్టం చేసింది. కరోనా సెకండ్ వేవ్లో అత్యధికంగా పంజాబ్ కేసులు పెరుగుతుండగా.. రికార్డు స్థాయిలో ఒకే రోజు 157 మంది మరణాలు నమోదవగా.. 7,327 కొత్త కేసులు రికార్డయ్యాయి.
ప్రభుత్వం ప్రస్తుతం ఆంక్షలు పొడగించడంతో అన్ని విద్యాసంస్థ మూసే ఉంటాయి. అన్ని పరీక్షలు వాయిదా పడుతాయి. అన్ని కార్లు, టాక్సీలు సహా నాలుగు చక్రాల వాహనాల్లో కేవలం ఇద్దరికే ప్రయాణం, అయితే.. రోగులను ఆసుతపత్రులకు తీసుకువెళ్లే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. అనవసరమైన వస్తువుల విక్రయాలను విక్రయించే అన్ని దుకాణాలు మూసే ఉంటాయి. మందులు, అవసరమైన వస్తువులైన పాలు, రొట్టె, కూరగాయలు, పండ్లు, పాల, ఫౌల్ట్రీ ఉత్పత్తులైన గుడ్లు, మాంసం విక్రయదారులకు అనుమతి ఉంటుంది.
కొత్త ఆదేశాల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కేవలం 50శాతంతో మాత్రమే పని చేయనున్నాయి. అన్ని ప్రైవేటు కార్యాలయాలు ఇంటి నుంచి మాత్రమే పని చేయాలని సూచించారు. వివాహాలు, అంత్యక్రియల్లో 10 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పటికే అమలులో ఉన్న సామాజిక, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు, ఇతర సమావేశాలపై నిషేధం విధించారు. ఇప్పటికే రాష్ట్రంలో సాయంత్రం 6 నుంచి 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ శుక్రవారం నుంచి సోమవారం వరకు కొనసాగుతోంది.