Tamilnadu Assembly Elections : తమిళనాడు ప్రజలు మళ్లీ తమ పాత పంథానే కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పటిలాగే ఓటర్లు మళ్లీ తీర్పునిచ్చారు. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల్లో అధికారాన్ని మార్పు చేయడం తమిళ ప్రజలకు అలవాటు. ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ ఈ సారి ఎన్నికల్లో విపక్ష పార్టీ డీఎంకేకు పట్టం కట్టారు. అధికార మార్పు సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికార పార్టీ అన్నాడీఎంకే పట్టం కట్టారు. కానీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన కొద్దిరోజులకే జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఎడప్పాడి పళనిస్వామి సీఎం అయ్యారు.
ఈ క్రమంలో దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధి, జయలలితల మరణానంతరం తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. అయితే తమిళ ప్రజలు మాత్రం తరాలు మారిన తమ తీర్పు మారదని నిరూపించారు. పాత సంప్రదాయాన్నే తిరిగి కొనసాగిస్తూ అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను దించేసి ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేకు పట్టం కట్టారు. దీంతో దిగ్గజ నేత కరుణానిధికి వారసుడిగా తమిళ రాజకీయాల్లోకి వచ్చి తండ్రి వెంటే నడిచిన స్టాలిన్.. ఇప్పుడు తొలిసారిగా సీఎం కుర్చీ ఎక్కబోతున్నారు.
ఇప్పటికే డిప్యూటీ సీఎంగా తమిళ రాజకీయాల్లో సంచలం సృష్టించిన స్టాలిన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎలా పాలన సాగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ ఎన్నికలతోనే కరుణానిధి, స్టాలిన్ వారసుడిగా ఉదయనిధి స్టాలిన్ను ప్రజలు అంగీకరిస్తూ విజయాన్ని అందించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Stalin : నాన్న లేడు.. అన్న అండ లేదు.. అయినా గెలిపించాడు
Udhayanidhi Stalin : తాతకు తగ్గ మనవడు.. తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలుపు
Prashant Kishor : బెంగాల్లో పంతం నెగ్గించుకున్న ప్రశాంత్ కిశోర్
West Bengal Elections : దీదీ హ్యాట్రిక్ కు కలిసొచ్చిన అంశాలివే..
సాగర్ రిజల్ట్.. తండ్రి మెజార్టీని అధిగమించిన తనయుడు..
రౌండ్ల వారీగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు
స్టాలిన్ గెలుపు : మేయర్ టూ ముఖ్యమంత్రి