మహబూబ్నగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ఊహించని విధంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో నిలిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో కలిపి 50 మంది అభ్యర్థులు పోరులో ఉన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 31మంది, నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 19మంది అభ్యర్థులు ఫైనల్గా మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన సోమవారం మహబూబ్నగర్ పార్లమెంటులో నలుగురు, నాగర్కర్నూల్లో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ల సమక్షంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో అత్యధికంగా 31మంది అభ్యర్థులు రం గంలో ఉండడం గమనార్హం. నాగర్కర్నూల్లోనూ ఈ సారీ అభ్యర్థుల సంఖ్య పెరిగింది. స్వతంత్ర అభ్యర్థుల ను ప్రధాన పార్టీలు పట్టించుకోకపోవడంతో చాలా మంది ఉపసంహరించుకోవడానికి వెనుకాడారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలకు రెండు పార్లమెంట్ పరిధిలో టికెట్లు ఆశించి అవకాశం దక్కని వారు రెబల్స్గా నామినేషన్లు వేశారు. వీరిని కూడా ఆయా పార్టీలు పట్టించుకోకపోవడంతో చివరగా పోటీలో నిలిచారు. ప్రధానం గా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ముక్కోణపు పోటీ అనివార్యమైంది. ఇక ఎన్నికలకు 14రోజులే సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి.
ఎన్నడూ లేనివిధంగా ఈసారి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గతంలో నామినేషన్లు వేసిన స్వతంత్రులకు ఆయా పార్టీలు నయానో భయానో ఇచ్చి ఒ ప్పించి ఉపసంహరణ చేయించేవారు. కానీ ఈసారి సీ న్ రివర్స్ అయింది. స్వతంత్రులను ఎవరూ పట్టించుకోకపోవడంతో వారంతా రంగంలో మిగిలారు. మరోవైపు మహబూబ్నగర్ లోక్సభ బరిలో బీఆర్ఎస్ తరఫున మన్నె శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచందర్రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ ప్రధాన పార్టీలనుంచి పోటీ చేస్తున్నారు. గత 2019 ఎన్నికల్లోనూ ఈ ము గ్గురే పోటీ పడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి 70వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కూడా పాత ప్రత్యర్థులే రంగంలో మిగిలారు. దీంతో మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల చిత్రం రసవత్తరంగా మారింది. అయితే గెలుపుపై ప్రధాన పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నాగర్కర్నూల్ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు 19 మంది రంగంలో మిగిలారు. నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పోటీ చేస్తుండడంతో ఉత్కంఠంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్ ఇదే పార్లమెంట్ పరిధిలోని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఇటీవలే బీఆర్ఎస్లో చేరడం, వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థిగా బరిలో నిలపడంతో అందరి దృష్టి ఈ పార్లమెంట్పైనే ఉన్నది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లురవి ఘోరపరాజయం పాలయ్యారు. ఈసారి కూడా మళ్లీ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ పోటీలో ఉన్నారు. వీరంతా నువ్వా.. నేనా అనే రీతిలో పోటీ పడుతుండగా.. మరో 16 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూ డా రంగంలో ఉన్నారు.