న్యూఢిల్లీ : ఓ కోతి మెట్రోరైలు ప్రయాణించింది. ఈ ఘటన ఢిల్లీలోని యమునా బ్యాంక్ స్టేషన్ మార్గంలో చోటు చేసుకుంది. రైల్లో హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. మొదట అటూ ఇటూ కలిగియ దిరిగిన వానరం తర్వాత ఓ ప్రయాణికుడి వద్ద సీటుపై కూర్చుతుంది. ట్రైన్ వెళ్తుండగా అద్దాల్లోంచి పరిసరాలను చూస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇంతకు ముందు సైతం ఢిల్లీలో ఒకసారి మెట్రోలో కోతి ప్రయాణించింది. మనుషులకు హాని చేస్తే పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో చేసిన ట్వీట్కు ఢిల్లీమెట్రో రైల్వే స్పందించింది. కోతి ప్రవేశించిన ట్రైన్ రూట్, ప్రస్తుతం ఉన్న స్టేషన్, కోచ్ వివరాలు ఇవ్వాలని కోరింది.