పనాజీ : కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. కరోనా కర్ఫ్యూను ఈ నెల 28 వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. అయితే, కొన్ని ఆంక్షలు ఇచ్చారు. మాల్స్, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లలో దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. చేపల మార్కెట్లు తెరిచేందుకు అనుమతులు జారీ చేశారు. ఈ నెల 28న ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని సీఎం తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో గోవా ప్రభుత్వం మే 9న కర్ఫ్యూ విధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు పొడగించగా.. సెకండ్ వేవ్లో పాజిటివిటీ రేటు 51శాతానికి చేరగా.. ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నది. గోవాలో శనివారం కొత్తగా 302 కరోనా కేసులు నమోదవగా.. మరో తొమ్మిది మంది వైరస్తో మృతి చెందారు. 419 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని ఆరోగ్యశాఖ వివరించింది.