హైదరాబాద్ : ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు తమిళనాడులో జరిగిన నాల్గో జాతీయస్థాయి ఫిస్ట్బాల్ పోటీల్లో చాంపియన్గా నిలిచిన తెలంగాణ జట్టును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి జట్టులో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన నలుగురు క్రీడాకారులు ఉండడంపై సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే మహబూబాబాద్ జిల్లా నుంచి ముగ్గురు, హైదారాబాద్ నుంచి ముగ్గురు క్రీడాకారులుండడంపై హర్షం ప్రకటించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు, క్రీడాకారులకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర జట్టులో పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరు గ్రామం నుంచి బాలబోయిన సందీప్, జోడు సంతోష్, రావుల కుమార స్వామి, దొంతమల్ల గణేశ్.. మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లు గుండాల గడ్డ తండాకు చెందిన లునావత్ సంతోష్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. మహేందర్ లునావత్, శ్రీకాంత్ టీమ్ సభ్యులుగా ఉన్నారు.
అలాగే, హైదరాబాద్కు చెందిన మండల ఆనంద్, రాహుల్, రాజేశ్ టీమ్ సభ్యులుగా ఉన్నారు. కాగా, తెలంగాణ స్టేట్ ఫిస్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మండలి విజయ్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము వెంకట్ ప్రోత్సాహంతో తాము ఎదిగామని.. ఈ సందర్భంగా వారికి క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..