హైదరాబాద్ : విధి నిర్వహణలో గాయపడిన కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి చెందాడు. ఈ నెల 27న నిజాంపేట రోడ్లో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి, హోంగార్డు కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న క్యాబ్ డ్రైవర్ వారిని ఢీకొట్టాడు.
దీంతో ఏఎస్ఐ తీవ్రంగా గాయపడటంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మహిపాల్ రెడ్డి బుధవారం ఉదయం కన్నుమూశారు. ఏఎస్ఐ నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..