జెరూసలేం : ఇజ్రాయెల్ రాజధాని అయిన జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ తెరుచుకున్నది. ఇజ్రాయెల్ పోలీసుల రక్షణలో 50 మంది యూదు యాత్రికులు మొదటి రోజు సాధారణ తీర్థయాత్రకు అక్కడికి చేరుకున్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఆదివారం వరుసగా మూడవ రోజు కూడా కొనసాగింది. తమ పవిత్ర స్థలం యూదులకు తెరిచిన మొదటి రోజున ఎలాంటి అవాంతరాలు లేవని, ప్రశాంతంగా యాత్ర కొనసాగిందని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా సంస్థ మధ్య 11 రోజుల యుద్ధం తర్వాత గాజా స్ట్రిప్లో ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడం ప్రారంభమైంది. అంతకుముందు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణను పూర్తిగా పాటించాలని పిలుపునిచ్చింది. భద్రతా మండలిలోని మొత్తం 15 మంది సభ్యుల తరఫున శనివారం ఒక ప్రకటనలో ‘హింస ఫలితంగా పౌరుల ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం ప్రకటించారు. పాలస్తీనా పౌర జనాభాకు, ముఖ్యంగా గాజాలో మానవీయ సహాయం అవసరం అని ఐరాస నొక్కి చెప్పింది.
ముస్లింలు కూడా ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇజ్రాయెల్ పోలీసులు-పాలస్తీనియన్ల మధ్య హింసాత్మక ఘర్షణలు యుద్ధ రూపాన్ని తీసుకున్న ఈ ప్రాంతంలో అల్-అక్సా మసీదు కూడా ఉన్నది. ఈ మసీదులో హింసాకాండ తర్వాత యూదుల తీర్థయాత్ర మొదటిసారిగా ప్రారంభమైంది. యూదులు కూడా ఈ స్థలాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. 1967 లో యుద్ధం అనంతరం ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది.
ఖలీస్తాన్ టైగర్ ఫోర్స్తో సంబంధమున్న ఇద్దరు అరెస్ట్
అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం.. తాజాగా వీడియో బయటకు
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ
ఎక్కువ జిగురు కోసం చెట్లకు విషపూరిత ఇంజెక్షన్లు..
నిన్న ఎయిర్ ఇండియా.. ఇవ్వాళ డొమినోజ్ డాటా లీక్..!
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
టిబెట్ను ఆక్రమించిన చైనా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..