ముంబై : దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జిగురుకు చాలా డిమాండ్ ఉన్నది. జిగురు తీసేందుకు ప్రత్యేకంగా చెట్లను పెంచుతున్నారంటే దానికున్న డిమాండ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎక్కువ జిగురు రావడం కోసం చెట్లకు విషపూరిత ఇంజెక్షన్లు చేస్తున్నట్లుగా బయటపడింది. ఈ విషపూరిత ఇంజెక్షన్లు క్యాన్సర్లు, పక్షవాతాన్ని కలిగిస్తాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా జిగురు సేకరణ ఎక్కువగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అడవుల్లో జరుగుతున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు, రసాయన పాలు, పండ్లు, కూరగాయలను ఉపయోగించిన జిగురు తీసేవారు. అయితే, డిమాండ్కు సరిపోయేంత ఉత్పత్తి లేకపోవడంతో పలువురు సరఫరాదారులు పక్కదారులు తొక్కుతున్నారు. అడవుల నుంచి వచ్చే జిగురును తీసుకోవడం ప్రారంభించారు. ధావ్డా, సలై, కులు, మొరిగే వంటి అడవి చెట్ల నుంచి ఎక్కువ మొత్తంలో జిగురు తీసేందుకు వీరు కొత్త పంథాను ఎంచుకున్నట్లు సమాచారం. ఎక్కువ జిగురు రావడానికి గాను ఇథాఫోన్ హార్మోన్లు, జెమ్క్సన్, పోలో, పారాక్వాట్ వంటి ప్రమాదకరమైన పాస్టిసైడ్లను చెట్లకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు జిగురు రావడాన్ని 2-3 రెట్లు పెంచుతాయట. అయితే ఇది చాలా ప్రమాదకరమని, ఊపిరితిత్తుల, కాలేయ క్యాన్సర్కు కారణమవుతుందని, అలాగే, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెట్టు కాండంలోకి ఈ పురుగుమందును ఇంజెక్ట్ చేసిన రెండు మూడు రోజుల తర్వాత జిగురు రావడం మొదలవుతుంది. ఇంజెక్షన్ చెట్టు సహజ పనితీరును ప్రభావితం చేస్తుందని, జిగురు ఎక్కువగా రావడాన్ని పెంచుతుందని మధ్యప్రదేశ్ రిటైర్డ్ చీఫ్ కన్జర్వేటర్ పీసీ దుబే చెప్పారు. జిగురు రంగు కూడా మారిపోతుంది.
మధ్యప్రదేశ్లోని దేవాస్, ఖండ్వా, ఖార్గోన్, బుర్హాన్పూర్, బార్వానీ, సలై ఖైర్, కులు, పలాష్ గమ్ అడవుల నుంచి 50 వేల క్వింటాళ్ల గమ్ అక్రమంగా ఇండోర్కు చేరుకుంటుంది. అలాగే, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద మొత్తంలో జిగురు ఇండోర్కు తీసుకువస్తున్నారు. ఇక్కడి నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సరఫరా చేసి పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నట్లు తెలుస్తున్నది.
జిగురు ఎక్కువగా రావడం కోసం వినియోగిస్తున్న పారాక్వాట్ అనే మందును 50 కి పైగా దేశాలు నిషేధించాయి. ఈ మందు వాడకం వల్ల చర్మం, గోరు, మెదడు కణాలను దెబ్బతీస్తుందని, పార్కిన్సన్, ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్కు కారణమవుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిన్న ఎయిర్ ఇండియా.. ఇవ్వాళ డొమినోజ్ డాటా లీక్..!
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
టిబెట్ను ఆక్రమించిన చైనా.. చరిత్రలో ఈరోజు
అది కాపీరైట్ ఉల్లంఘనే: ఢిల్లీ హైకోర్టు
రెజ్లర్ సాగర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ అరెస్ట్
మార్స్పై పని మొదలుపెట్టిన చైనా రోవర్
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..