న్యూఢిల్లీ : నిన్న ఎయిర్ ఇండియా డాటా లీకై కలవరానికి గురిచేయగా.. ఇవాళ పిజ్జాలు తయారీదారు డొమినోజ్లో కూడా డాటా లీక్ అయింది. దాదాపు 18 కోట్ల ఆర్డర్ డాటా లీకైనట్లుగా సదరు కంపెనీ తెలిపింది. అయితే, వినియోగదారుల ఆర్థిక సమాచారానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని సంస్థ స్పష్టం చేసింది.
పిజ్జా బ్రాండ్ డొమినోజ్ కస్టమర్ డాటా లీక్ అయింది. సంస్థలోని 18 కోట్ల మంది చందాదారుల ఆర్డర్ల డాటా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాజశేఖర్ రాజరియా తెలిపారు. డార్క్ వెబ్లో హ్యాకర్ సెర్చ్ ఇంజిన్ను సృష్టించాడని రాజరియా పేర్కొన్నారు. ఈ సెర్చ్ ఇంజిన్లో వచ్చిన లాంగా, చందాదారుడిపై నిఘా పెట్టడానికి దీనిని ఉపయోగించినట్లుగా ఆయన వెల్లడించారు.
తమ వినియోగదారుల డాటా లీక్ అయిన విషయం నిజమే అని డొమినోజ్ ఒప్పుకున్నది. అయితే, ఇది తమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం చూపలేదని తెలిపింది. సైట్ భద్రతకు సంబంధించిన సంఘటన జరిగిందని డామినోజ్ యజమాని జూబిలెంట్ ఫుడ్వర్క్స్ అంగీకరించింది. కానీ చందాదారుల ఆర్థిక సమాచారం లీక్ కాలేదని తెలిపింది. సంస్థ ఎటువంటి ఆర్థిక సమాచారం లేదా క్రెడిట్ కార్డ్ డాటాను నిల్వ చేయదని డొమినోజ్ పేర్కొన్నది. తమ నిపుణులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
టిబెట్ను ఆక్రమించిన చైనా.. చరిత్రలో ఈరోజు
అది కాపీరైట్ ఉల్లంఘనే: ఢిల్లీ హైకోర్టు
రెజ్లర్ సాగర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ అరెస్ట్
మార్స్పై పని మొదలుపెట్టిన చైనా రోవర్
సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు : జుంటా నేత హ్లింగ్
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..