మోగా : పంజాబ్ పోలీసులు భారీ విజయాన్ని సాధించారు. ఖలీస్తాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) తో సంబంధం ఉన్న ఇద్దరు నేరస్థులను అరెస్టు చేశారు. వీరిద్దరూ అనేక ఘోరమైన నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. డేరా ప్రేమిని చంపి పూజారిపై దాడి చేసినట్లు కూడా వీరిపై ఆరోపణలు ఉన్నాయి. కెనడాకు చెందిన కేటిఎఫ్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ఆధ్వర్యంలో వీరిద్దరూ పనిచేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.
నిందితులు లవ్ప్రీత్ సింగ్ అలియాస్ రవి, రామ్ సింగ్ అలియాస్ సోను ఇద్దరినీ శనివారం అర్థరాత్రి అరెస్టు చేశారు. వారు మరొక డేరా ప్రేమిని చంపడానికి కుట్ర పన్నారు. పోలీసులకు దీని గురించి సమాచారం రావడంతో మెహ్నాలోని ప్రభుత్వ పాఠశాల వెనుక వైపున కాపుకాసి పకడ్బందీగా వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి నుంచి మూడు 0.32 బోర్ పిస్టల్స్, 38 లైవ్ కార్ట్రిడ్జ్లు , ఒక 0.315 బోర్ పిస్టల్, 10 లైవ్ కాట్రిడ్జ్లతో పాటు రెండు మ్యాగజైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం.. తాజాగా వీడియో బయటకు
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ
ఎక్కువ జిగురు కోసం చెట్లకు విషపూరిత ఇంజెక్షన్లు..
నిన్న ఎయిర్ ఇండియా.. ఇవ్వాళ డొమినోజ్ డాటా లీక్..!
సెప్టెంబర్లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
టిబెట్ను ఆక్రమించిన చైనా.. చరిత్రలో ఈరోజు
అది కాపీరైట్ ఉల్లంఘనే: ఢిల్లీ హైకోర్టు
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..