న్యూఢిల్లీ: నాలుగు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది. భయాందోళన చెందిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ పగుళ్లివ్వడంతో అందులోని నివాసితులను సకాలంలో ఖాళీ చేయించారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. (Building Collapses) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జూన్ 3న సాయంత్రం 6:38 గంటల సమయంలో ప్రకాష్ విహార్లోని నాలుగు అంతస్తుల నివాస భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. దీంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, విపత్తు నివారణ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
కాగా, ఉత్తర ప్రదేశ్కు చెందిన పౌర శాఖ ఆ భవనం సమీపంలో డ్రైనేజీ నిర్మాణం, మరమ్మతు పనులు చేపడుతున్నది. దీని కారణంగా ఆ రోజు మధ్యాహ్నం సమయంలో ఆ నివాసిత బిల్డింగ్లో పగుళ్లు కనిపించాయి. ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు, స్థానికులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ భవనంలోని నివాసితులను ఖాళీ చేయించారు.
మరోవైపు కొన్ని గంటల్లోనే ఆ బిల్డింగ్ కూలిపోయింది. దీంతో స్థానిక నివాసితులు భయంతో పరుగులు తీశారు. అయితే నివాసితులను ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
After Malviya Nagar its from karawal nagsr where four-storey residential building collapsed triggering panic in the neighbourhood residents had evacuated structure after cracks began appearing earlier in the day preventing any casualties. #Delhi #KarawalNagar #BuildingCollapse pic.twitter.com/X2YybkUSv8
— Neharika Maheshwari🇮🇳 (@niharikam_21) June 4, 2026