న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో ఉన్న పురాతన జామా మసీదు మరమ్మతు కోసం షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయం కోరారు. జామా మసీదు మరమ్మతు చేపట్టడానికి భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ)ను ఆదేశించాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి బలమైన గాలులు, వర్షం కారణంగా జామా మసీదు మినార్ దెబ్బతిన్నది. టవర్లోని కొన్ని రాళ్ళు ఊడి పడిపోయాయి. అటువంటి పరిస్థితిలో జామా మసీదు మరమ్మతు అవసరమని బుఖారీ తెలిపారు. లాక్డౌన్కు ముందే భారత పురావస్తు శాఖ జామా మసీదు మరమ్మతు పనులను ప్రారంభించింది. అయితే, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు టవర్లోని రాళ్లు కొన్ని పడిపోయాయి.
అందిన సమాచారం ప్రకారం, బలమైన తుఫాను గాలుల కారణంగా చారిత్రాత్మక జామా మసీదు మినార్ దెబ్బతిన్నది. వీలైనంత త్వరగా మరమ్మతులు చేయాలని షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ కోరుకుంటున్నారు. అందుకే మరమ్మతు పనులు త్వరలో ప్రారంభించేలా ఆయన ప్రధాని మోదీ సహాయం కోరారు. వాస్తవానికి, చారిత్రక భవనాల నిర్వహణ, మరమ్మత్తు పనులు భారత పురావస్తు సర్వే చేత జరుగుతాయి. అందుకని మరమ్మతు పనులు చేపట్టడం కోసం సంబంధిత విభాగానికి దిశానిర్దేశం చేయాలని బుఖారీ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
గత కొద్ది రోజులుగా ఢిల్లీలో బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ కారణంగా చాలా చోట్ల చెట్లు పడిపోయాయి. రాజధానిలో తుఫాను కారణంగా దాదాపు 300 చెట్లు దెబ్బతిన్నాయి. చెట్లు పడటం వల్ల చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
కొత్త సేవలు : స్పీడ్ పోస్ట్లో అస్తికల నిమజ్జనం
ఇమ్యూనిటీ బూస్టర్ : పనస గింజల్లో దాగి ఉన్న ఆరోగ్యం
ఫుల్ ట్రోలింగ్ : తొలి డోసు తీసుకున్న ములాయం
ఆధిపత్యం వద్దు : చైనా విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆందోళన
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..