క్రికెట్ ప్రియులు ఎంతగానో ఇష్టపడే వన్డే వరల్డ్ కప్ 46 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైంది. గమ్మత్తైన విశేషమేంటంటే.. ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ తరఫున ఆడిన గవాస్కర్ 174 బంతులను ఎదుర్కొని కేవలం 36 పరుగులు చేయడం. ఇంగ్లండ్లో ఆడిన ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొన్నాయి. మొదటి ప్రపంచ కప్ను క్లైవ్ లాయిడ్ నాయకత్వంలో వెస్టిండీస్ జట్టు గెలుచుకున్నది. ఈ ప్రపంచ కప్ ప్రత్యేక లక్షణం ఏమిటంటే.. ప్రతి మ్యాచ్ 60 ఓవర్ల పాటు ఆడటం.
మొదటి ప్రపంచ కప్లో 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా, తూర్పు ఆఫ్రికా జట్లు.. రెండో గ్రూపులో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. మొత్తం టోర్నమెంట్ 16 మ్యాచ్లు ఇంగ్లండ్లోనే 4 వేర్వేరు మైదానాల్లో ఆడించి, ఫైనల్ మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిపారు.
ఈ ప్రపంచ కప్లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ రెండు కారణాల వల్ల ఇప్పటికీ గుర్తుకు వస్తుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ డెన్నిస్ అమిస్ సెంచరీ చేయడం ప్రపంచ కప్లో తొలి సెంచరీ. కాగా, భారత బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ చాలా నెమ్మదిగా ఆడి 174 బంతుల్లో 36 పరుగులు మాత్రమే చేశాడు. ఈ టోర్నమెంట్లో నాకౌట్ దశలోనే భారత జట్టు ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఫైనల్స్ వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరిగింది. వెస్టిండీస్ జట్టు 17 పరుగుల తేడాతో గెలిచి తొలి కప్ను ఒడిసిపట్టుకున్నది.
2020: నాలుగు లక్షలకు చేరుకున్న ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య
2019: పర్యాటకులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లనున్నట్లు ప్రకటించిన నాసా
2017: ఇరాన్లో ఐసిస్ తొలి ఉగ్ర దాడి, టెహ్రాన్లో జరిపిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణం
2013: తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
2010: భోపాల్ గ్యాస్ విషాదంలో ఏడుగురు యూనియన్ కార్బైడ్ ఉద్యోగులను దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు
2005: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి ఎల్కే అద్వానీ రాజీనామా
1995: బోయింగ్ -777 విమానాలు మొదటిసారి యునైటెడ్ ఎయిర్లైన్స్లో చేరిక
1991: ఫిలిప్పీన్స్లోని పినాటుబో పర్వతంపై మొదటిసారి పేలిన అగ్నిపర్వతం
1979: మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన భారతదేశం
1955: సోవియట్ యూనియన్ను సందర్శించిన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ
1893: సత్యాగ్రహానికి పునాది వేసిన మహాత్మా గాంధీ
రుతుపవనాల ప్రభావం : శ్రీలంక జలమయం, 14 మంది మృతి
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..
అదే స్వరం : కొవిడ్కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..