ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి షరతులపై భారత్తో చర్చలు జరుపడానికి సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి ప్రచురితమవుతున్న ఒక ఉర్దూ వార్తాపత్రికకు ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బారత్తో చర్చలకు సిద్ధమేనని తెలిపారు. అయితే, కశ్మీర్లో పాత పరిస్థితిని పునరుద్ధరించడానికి భారత్ రోడ్మ్యాప్ ఇస్తేనే వారితో చర్చలు జరపడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నదని అన్నారు. కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా భారత్ రెడ్ లైన్ దాటిందని, అయితే భారత్ ఈ రోడ్మ్యాప్ ఇవ్వడం ద్వారా తిరిగి చర్చలకు కూర్చోవచ్చన్నారు. భారత్తో ఎప్పుడూ ఓపెన్హార్ట్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
2019 ఆగస్టు నిర్ణయాన్ని రద్దు చేయడానికి భారత్ ఏ చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సి ఉంటుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ అన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభించడం పాకిస్థాన్కు ఆమోదయోగ్యమని చెప్పారు. భారతదేశం యొక్క ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ చట్టం, ఉమ్మడి భద్రతా మండలి నిబంధనల ఉల్లంఘనే అని ఇమ్రాన్ మరోసారి పేర్కొన్నారు. అయితే, ఇది తమ అంతర్గత విషయమని భారత్ ఇప్పటికే పేర్కొన్నది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఏ దేశానికీ లేదని స్పష్టం చేసింది.
ఆఫ్ఘనిస్తాన్లో స్నేహపూర్వక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం దశాబ్దాల నాటి వ్యూహాత్మక విధానాన్ని మార్చిందని రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో తమకు నచ్చిన ప్రభుత్వాన్ని తీసుకురావడానికి పాకిస్తాన్ ఎటువంటి అవకతవకలను ప్రయత్నించదని, అక్కడి ప్రజలు ఎవరిని అధికారంలోకి తీసుకొచ్చినా అంగీకరిస్తామని ఇమ్రాన్ అన్నారు. అమెరికా బలగాలు వైదొలిగిన తర్వాత ఆఫ్ఘాన్లో అంతర్యుద్ధం ప్రారంభమవుతుందని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.
ఆఫ్ఘాన్లో బాంబు పేలుడు : 11 మంది దుర్మరణం
అదే స్వరం : కొవిడ్కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్
భాషా వివాదం : ఈ దవాఖానలో మలయాళంలో మాట్లాడొద్దు..
చరిత్రలో ఈరోజు.. భాగమతి నదిలో రైలు దుర్ఘటనకు 40 ఏండ్లు
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మమత మేనల్లుడు
ఐరాస నివేదిక : అల్-ఖైదా అధినేత జవహరి బతికే ఉన్నాడు..
లినెథోల్మ్ ద్వీపం : సముద్ర మట్టం పెరగకుండా డెన్మార్క్ సృష్టి
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..