బిహార్లోని భాగమతి నదిలో కూలిపోయి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు దుర్మరణం పాలై నేటికి సరిగ్గా 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. చాలా మంది ఇప్పటికీ జాడలేకుండా పోయారు. వారు చనిపోయిందీ, కనిపించకుండా పోయిందీ తెలియడం లేదు. బిహార్లోని మాన్సీ స్టేషన్ నుంచి సహర్సాకు బయల్దేరిన రైలు భాగమతి నది వంతెనపైకి రావడంతో ఒక్కసారిగా కుదుపుకు లోనై నదిలో కూలిపోయింది. అప్పటికే వర్షం కురుస్తున్నందున ప్రయాణికులు కిటికీలు మూసుకుని ఉన్నారు. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు రాలేక నదిలో మునిగి ప్రాణాలు విడిచారు. ఈ దుర్ఘటనలో మొత్తం 7 బోగీలు వంతెన పైనుంచి నదిలో పడిపోయాయి.
రైలు నదిలో పడటానికి రెండు కారణాలు చెప్పారు. మొదటిది .. రైలు వెళ్తుండగా ఒక పశువు అడ్డంగా రావడంతో దానిని కాపాడేందుకు డ్రైవర్ సడెన్గా బ్రేక్లు వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండవ కారణం.. రైలు కిటికీలు, తలుపులన్నీ మూసివేసి ఉండటంతో బలమైన తుఫాను ఒత్తిడి రైలుపై పడి రైలు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారో ఖచ్చితమైన గణాంకాలు లేవు. 500 మంది మరణించారని రైల్వే శాఖ తెలిపింది. తర్వాత మరణించిన వారి సంఖ్య 3 వేలుగా నమోదైంది. ఈ ప్రమాదంలో ఇప్పటికీ చాలా మంది జాడ లేదు. ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి 286 మృతదేహాలను నది నుంచి బయటకు తీశారు.
2017: మధ్యప్రదేశ్లోని మాండ్సర్లో ఓపియం పండిస్తున్న రైతులపై కాల్పులు, ఆరుగురు మృతి
2004: అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ మరణం
2004: తమిళ భాషకు క్లాసిక్ లాంగ్వేజ్ హోదాను ఇచ్చిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం
2002: పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాల దాడి
1999: టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న లియాండర్ పేస్-మహేష్ భూపతి జోడి
1984: మొదటి టెట్రిస్ గేమ్ ప్రారంభం
1882: ఎలక్ట్రిక్ ప్రెస్ కోసం పేటెంట్ పొందిన న్యూయార్క్కు చెందిన హెన్లీ సీలే
1847: మొదటిసారి తయారైన డెనిమ్ జీన్స్
1674: రావగడ్ కోటలో శివాజీ పట్టాభిషేకం
1596: సిక్కుల ఆరవ గురువు హర్గోవింద్ జీ జననం
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మమత మేనల్లుడు
ఐరాస నివేదిక : అల్-ఖైదా అధినేత జవహరి బతికే ఉన్నాడు..
లినెథోల్మ్ ద్వీపం : సముద్ర మట్టం పెరగకుండా డెన్మార్క్ సృష్టి
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..