వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడి ఉన్న సమయంలో చైనాపై చేసిన ఆరోపణలనే డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేశారు. కరోనా వైరస్కు చైనాదే బాధ్యత అని కుండబద్దలు కొట్టారు. చైనా నుంచి నష్టపరిహారం డిమాండ్ చేయాలని ప్రపంచం దేశాలను కోరారు. కొవిడ్ -19 వల్ల కలిగే నష్టానికి చైనా నష్టపరిహారం చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. శనివారం నార్త్ కరోలినా రిపబ్లికన్ సదస్సులో ట్రంప్ మాట్లాడారు.
“అమెరికాతోపాటు ప్రపంచంలోని అన్ని దేశాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నుంచి పరిహారంతోపాటు జవాబుదారీతనం కోరవలసిన సమయం ఆసన్నమైంది. చైనా నష్టపరిహారాన్ని చెల్లించాలని మనమందరం ఒకే గొంతులో డిమాండ్ చేద్దాం. వారు తప్పక పరిహారం చెల్లించాల్సిందేష అని ట్రంప్ చెప్పారు. ‘చైనా వైరస్’ వచ్చే వరకు జీ జిన్పింగ్తో తనకు చాలా మంచి సంబంధం ఉండేవన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్ల చైనా పెద్దగా పట్టించుకోదని, అన్ని చైనా ఉత్పత్తులపై 100 శాతం పన్నులను విధించడానికి అమెరికా వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రంప్ నొక్కిచెప్పారు.
ఒక కొత్త అధ్యయనం ప్రకారం, చైనా శాస్త్రవేత్తలు వుహాన్లోని ప్రయోగశాలలో వైరస్ను సృష్టించారు. తర్వాత వైరస్ రివర్స్-ఇంజనీరింగ్ వెర్షన్ల ద్వారా దాని ట్రాక్లను కవర్ చేయడానికి ప్రయత్నించారు. ఇది గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపిస్తున్నది. ఈ నెల ప్రారంభంలో వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్లో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు.
భాషా వివాదం : ఈ దవాఖానలో మలయాళంలో మాట్లాడొద్దు..
చరిత్రలో ఈరోజు.. భాగమతి నదిలో రైలు దుర్ఘటనకు 40 ఏండ్లు
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మమత మేనల్లుడు
ఐరాస నివేదిక : అల్-ఖైదా అధినేత జవహరి బతికే ఉన్నాడు..
లినెథోల్మ్ ద్వీపం : సముద్ర మట్టం పెరగకుండా డెన్మార్క్ సృష్టి
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..