కొలంబో : శ్రీలంకలో రుతుపవనాల రాకతో భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీలంకలోని కొలంబో, రత్నపురతోపాటు పలు జిల్లాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2.40 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. గురువారం రాత్రి నుంచి దేశంలోని పలు జిల్లాల్లో రుతుపవనాల కారణంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్ళు, వరి పొలాలు, రోడ్లు మునిగిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 10 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా తయారైందని విపత్తు నిర్వహణ జాతీయ కేంద్రం అధిపతి మేజర్ జనరల్ సుదాంత రణసింగ్ తెలిపారు.
వర్షాలకు నిరాశ్రయులైన వారి కోసం 72 సహాయ శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో 3,500 కు పైగా కుటుంబాలు ఉన్నాయి. రుతుపవనాల వర్షంతో కలుతారా, గంపా, కొలంబో, రత్నపుర, కేగల్లె సహా అనేక జిల్లాలు మునిగిపోయాయి. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆరు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే హెచ్చరికలను జాతీయ పరిపాలనా పరిశోధనా సంస్థ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కొవిడ్-19 టీకా కార్యక్రమం కూడా ప్రభావితమైంది. ఇలాఉండగా, నైరుతి రుతుపవనాలు బిహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు వచ్చే 10 రోజుల్లోగా చేరుకునే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది.
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
జెరూసలేంలో అల్ జజీరా మహిళా జర్నలిస్ట్ అరెస్ట్
WWDC 2021: రేపటి నుంచి ఆపిల్ ఈవెంట్ ప్రారంభం
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..
ఆఫ్ఘాన్లో బాంబు పేలుడు : 11 మంది దుర్మరణం
అదే స్వరం : కొవిడ్కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్
భాషా వివాదం : ఈ దవాఖానలో మలయాళంలో మాట్లాడొద్దు..
చరిత్రలో ఈరోజు.. భాగమతి నదిలో రైలు దుర్ఘటనకు 40 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..