మనం ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు దోహదపడుతుంటాయి. మనం అన్ని పండ్లను తింటూ వాటిలోని గింజలను మాత్రం పారేస్తుంటాం. కొన్ని పండ్ల గింజల ప్రయోజనాలు తెలియక వాటిని తినకుండా ఉంటాం. పనస పండు గింజలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను దాచుకుని ఉంటుంది. పనస పండును తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు తొనల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి పోషకాలు విరివిగా లభిస్తాయి. అలసట తగ్గడంతోపాటు చర్మ సౌందర్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే, పనస పండు గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
పనస గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి ఐరన్ లభించి రక్తహీనత సమస్య నుంచి గట్టెక్కవచ్చు. రక్త వృద్ధి కూడా జరుగుతుంది. వీటిని తినేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా పెంచుకోవచ్చు.
శరీర జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు పనస గింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ సమస్యలతో శరీరం బరువుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు పనసపండు గింజలను ఉడికించి తింటే ఆహారం త్వరగా జీర్ణమై అజీర్తి సమస్యలు దూరమవుతాయి.
మహిళలు పొడవాటి జుట్టును కోరుకుంటుంటారు. పని ఒత్తిడి వల్ల చాలా మందిలో జుట్టు రాలిపోతుంటుంది. అలాంటి వారికి పనస గింజలు అధిక మేలు చేస్తాయి.
ఆధునిక చదువులతో చిన్నారులకే కళ్లద్దాలు వస్తున్నాయి. టీవీ, మొబైల్, కంప్యూటర్ చూడటం వల్ల కళ్లకు ఎక్కువ ఒత్తిడి కలిగి కంటి సమస్యలు పెరుగుతున్నాయి. కంటి ఆరోగ్యంపై దృష్టిపెట్టడానికి ముందు పనస గింజలను గుర్తుచేసుకోవాలి. కంటి సమస్యల పరిష్కారం కోసం మొలకెత్తిన పనస గింజలు తినాలి.
అందరూ యవ్వనంగా కనిపించేందుకు కనిపించిన క్రీములను రాసేస్తుంటారు. అయినా, చర్మం ముడుతలు తగ్గవు. చిన్న వయసులోనే ఎంతో వయసు వచ్చిన వారి మాదిరిగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు పనస పండు తినడం ద్వారా చర్మ సౌందర్యం పెంచుకోవచ్చు. అలాగే, పనస విత్తనాలను చూర్ణం చేసి పాలతో కలిపి తీసుకుంటే ముఖంపై ముడతలు తగ్గి ప్రకాశవంతంగా మారుతుంది.
మనిషికి శృంగారం కూడా చాలా ముఖ్యం. పనస తొనలతోపాటు.. గింజలను ప్రతిరోజూ తింటే శృంగార సమస్యలను దూరం చేసుకోవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా వీటిని నిత్యం తీసుకునే వారిలో ఎముకలతోపాటు దంతాలు గట్టిగా తయారవుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న పనస గింజలను వృధాగా పారేయకండి.. వీటిని కూడా తిని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి..!
ఫుల్ ట్రోలింగ్ : తొలి డోసు తీసుకున్న ములాయం
ఆధిపత్యం వద్దు : చైనా విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆందోళన
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..