న్యూఢిల్లీ : గ్లోబల్ టాక్సేషన్ విధానానికి ప్రపంచంలోని ఏడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల దేశాలు అంగీకరించాయి. ఇటీవల లండన్లో జరిగిన జీ 7 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల రెండు రోజుల సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 శాతం గ్లోబల్ మినిమం కార్పొరేట్ టాక్స్ విధించేందుకు ఒప్పందం కుదిరింది. ఇకపై జీ 7 దేశాలు గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి బహుళజాతి కంపెనీల నుంచి కనీసం 15 శాతం పన్ను తీసుకుంటాయి. ఈ విధానంతో భారత్ కూడా లాభపడనున్నది. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. జీ 7 గ్రూపులో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జపాన్ ఉన్నాయి.
గ్లోబల్ మినిమం కార్పొరేట్ టాక్స్పై జీ 7 దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందంతో భారత్కు కూడా ప్రయోజనం కలుగనున్నది. భారతదేశ ప్రస్తుత పన్ను రేటు ప్రపంచ కనీస పన్ను రేటు కంటే ఎక్కువగా ఉన్నదని నిపుణులు అంటున్నారు. ఇది భారతదేశంలో వ్యాపారం చేస్తున్న సంస్థలను ప్రభావితం చేయదు. దీంతో భారత్ తన పెద్ద మార్కెట్ కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలదని నంగియా అండర్సన్ ఇండియా చైర్పర్సన్ రాకేశ్ నంగియా చెప్పారు. ఇలా ఉండగా, భారతదేశం 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించింది. ప్రస్తుతం ఉన్న కంపెనీలకు పన్ను రేట్లు 25 శాతానికి తగ్గించారు. ఇదే సమయంలో కొత్త దేశీయ ఉత్పాదక యూనిట్ల ఏర్పాటుపై పన్ను రేటును 22 శాతం నుంచి 15 శాతంకు తగ్గించారు.
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
రుతుపవనాల ప్రభావం : శ్రీలంక జలమయం, 14 మంది మృతి
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..
అదే స్వరం : కొవిడ్కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..