న్యూఢిల్లీ : సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోమవారం కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. గుర్గావ్లోని మేదంత దవాఖానలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు. నేతాజీ వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో రావడంతో నెటిజెన్లు అఖిలేష్ను ఫుల్లుగా ట్రోలింగ్ చేస్తున్నారు. జనవరి 2 వ తేదీన కేంద్రం టీకాలు వేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ములాయం కుమారుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వ్యాక్సిక్లకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇది బీజేపీ వ్యాక్సిన్. ఇది నమ్మదగినది కాదు. కాబట్టి నేను ప్రస్తుతం టీకాలు తీసుకోవడం లేదు. మన ప్రభుత్వం ఏర్పడగానే అందరికీ ఉచిత వ్యాక్సిన్ వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
ములాయం సింగ్ యాదవ్ చాలా కాలంగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో గతేడాది ఆగస్టులో అతడిని మేదంత దవాఖానలో చేర్పించారు. మూత్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ములాయంకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలనే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. దాంతో ఆయనకు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించడంతో ఆయన సోమవారం నాడు తొలి డోసు తీసుకున్నారు.
నేతాజీకి టీకా తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అఖిలేష్ యాదవ్ను నెటిజెన్లు ట్రోలింగ్ చేయడం ప్రారంభించాడు. యూజర్లు అఖిలేష్ యాదవ్ ఫొటోను ట్యాగ్ చేసి.. మీ ప్రభుత్వం ఏర్పడిందా? అని ఒకరు అడగ్గా.. నేతాజీకి ఎస్పీ వ్యాక్సిన్ ఇచ్చారా? అని మరొక వినియోగదారు.. మీ తండ్రి మిమ్మల్ని విశ్వసించడం లేదు.. అందుకే ఆయన మోదీ ప్రభుత్వ వ్యాక్సిన్ తీసుకున్నారు అని ఇంకో నెటిజెన్ కామెంట్లు రాశారు.
ఆధిపత్యం వద్దు : చైనా విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆందోళన
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..