తిరువనంతపురం : యూఏఈకి చెందిన వ్యాపారివేత్త, లులూగ్రూప్స్ చైర్మన్ యూసఫ్ అలీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఆదివారం ఉదయం కేరళలోని పనాంగడ్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం కారణంగా చిత్తడి నేలపై ల్యాండింది. ఘటన జరిగిన సమంలో యూసఫ్ అలీ, ఆయన భార్యతో పాటు ఏడుగురు ఉన్నారు.
ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హెలీకాప్టర్లో ప్రయాణిస్తున్న వారందరినీ సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అలీతో పాటు మిగతా వారంతా సురక్షితంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. హెలీకాప్టర్ ఫిషరీస్ కళాశాల మైదానంలో దిగాల్సి ఉండగా.. సాంకేతిక లోపంతో 200 మీటర్ల దూరంలో ఉన్న చిత్తడి నేలపై దిగిందని పనాంగడ్ పోలీస్ వర్గాలు తెలిపారు.