దండేపల్లి, మే 9: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమైతామని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పిలుపునిచ్చారు. గురువారం దండేపల్లి మండలంలోని నాయకపుగూడెం, కంచరబాయి, మామిడిగూడెం, దమ్మన్నపేట గిరిజన గ్రామాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గిరిజన గూడాలను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, బీఆర్ఎస్ నాయకులు గోళ్ల రాజమల్లు, గొట్ల భూమన్న, వెంకటరమణ, అజయ్, రాకేశ్, అఖిల్, ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులున్నారు.
లక్షెట్టిపేట, మే 9 : పనిచేసే నాయకుడికే పట్టం కట్టాలని, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మె ల్యే నడిపల్లి దివాకర్రావు ఓటర్లను అభ్యర్థించారు. లక్షెట్టిపేట పట్టణంలోని 2, 13వ వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ప్రజలను మభ్యపెట్టె హామీలిచ్చిన కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మనం కష్టాలను తెచ్చుకున్నవాళ్లమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ మెట్టు కల్యాణి రాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, నాయకులు బోడ సతీశ్రెడ్డి, ముత్తె తిరుపతి, చాంద్పాషా, ఇంతియాజ్, కలీం తదితరులు ఉన్నారు.
రంగపేట గ్రామంలో.. మండలంలోని రంగపేటలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిప్పకుర్తి నారాయణ, మహేందర్రెడ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్, మే 9: పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాదిగ, ఉపకులాల ప్రజలకు ఎమ్మార్పీఎస్ (టీఎస్) జిల్లా ఇన్చార్జి తగరం మధురాజ్ పిలుపునిచ్చారు. చెన్నూర్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గురువారం గడపగడపకూ ఎన్నికల ప్రచారం చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ఆరోపించారు. ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ (టీఎస్) నాయకులు శ్రావణ్, ప్రశాంత్, శ్యాం, శేఖర్, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి, మే 9 : మండలంలోని వెంచపల్లి, సూపాక, జనగామ, ఆలుగామ, రొయ్యలపల్లిలో బీఆర్ఎస్ మండల పార్టీ యూత్ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున ఇంటింటా ప్రచారం చేశారు. అకాల వర్షంతో రైతులు నష్టపోతే పరామర్శించే నాయకుడు కాం గ్రెస్ పార్టీలో లేడని, ఆ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షులు ఆసంపల్లి సంపత్ కుమార్, సాదిక్, నాయకులు లక్కం ఆనంద్, కొడిశెట్టి రాజు, బొడ్డు మల్లయ్య, అంగ మల్లయ్య, గడ్డం పున్నం, నిట్టూరి సాగర్, నూతన్, సురేశ్, కుమ్మరి సురేందర్, ప్రేంసింగ్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి, మే 9: ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్నే గెలిపించాలని కోరుతూ మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు మూడవ జోన్, 13వ వార్డు స్టేషన్ రోడ్డు కాలనీల్లో బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెడుతూ ఓటర్లను అభ్యర్థించారు. మార్కెట్ ఏరియా, పాలచెట్టు ఏరియా, పాత బస్టాండ్, రామన్ కాలనీ, విద్యానగర్, శాంతినగర్ కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచార కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, బడికెల సంపత్, బండారు సూరిబాబు, ఒడ్నాల శంకర్, అనిల్ కుమార్, డీ నవీన్, రమేశ్, మహిళా నాయకులు తోకల నిరోష, లలిత, సులోచన, రమ, శారద, రోజ, అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
తాండూర్, మే 9 : ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ను ఓడించాలని బోయపల్లి ఎంపీటీసీ, బుగ్గ దేవస్థానం చైర్ పర్సన్ మాసాడి శ్రీదేవి పిలుపునిచ్చారు. మండలంలోని బోయపల్లితో పాటు పలు గ్రామాల్లో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఆమె గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రుకుం ప్రసాద్, వేల్పుల శంకర్, కొమ్మ మల్లేశ్, దాడి బాలాజీ, మిట్ట నారాయణ, మాసాడి పురుషోత్తం, ఇస్తారి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. తాండూర్ మాజీ జడ్పీటీసీ మంగపతి సురేశ్బాబు ఆధ్వర్యంలో సుభద్ర కాలనీ, కొత్తగుడిసెలు కాలనీలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింటు, సంతోష్, ఈక్బాల్, ఆసిఫ్, బషీర్, శివ, నవీన్, వంశీ, కార్యకర్తలు పాల్గొన్నారు. కిష్టంపేటలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోమాస తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ సుమన్, జాడి పోశం, బీఆర్ఎస్వీ నాయకులు భరత్ కుమార్, వెంకటేశ్, విల్సన్, సచిన్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట, మే 9 : కాసిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, మాజీ సర్పంచ్ ఆడె బాదు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్ కార్యదర్శి మోటూరి వేణు, గ్రామ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, లంక లక్ష్మణ్, చింతల భీమయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంటెంకి వాస్దేవ్, మడిపల్లి తిరుపతి, ఉస్కమల్ల గోపాల్, దుర్గం శేఖర్, సుశీల తదితరులు పాల్గొన్నారు. దేవాపూర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా ప్రచారం చేశారు. లంబాడీతండా(డీ)లో మాజీ సర్పంచ్ అజ్మీరా తిరుపతి, ఉప సర్పంచ్ రాజేశ్, గ్రామ అధ్యక్షుడు అజ్మీరా దేవిలాల్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనుల వద్ద ప్రచారం చేశారు.
శ్రీరాంపూర్, మే 9 : సింగరేణిలో 20 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించి ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య పేర్కొన్నారు. గురువారం నస్పూర్ శ్రీరాంపూర్ ఏరియా 16, 17 వార్డులు గాంధీనగర్, హిమ్మత్నగర్లలో వాడ వాడలా, ఇంటింటా నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకుడు కే సురేందర్రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. కార్మికుడి బిడ్డగా, కార్మికుడిగా పనిచేసిన బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
సింగరేణి స్థలంలో నివాస ఉంటున్న కార్మిక కుటుంబాలకు పట్టాలు, రూ.10 లక్షల వడ్డీలేని గృహ రుణాలు, క్వార్టర్లకు ఉచిత విద్యుత్, ఏసీ సౌకర్యం, కార్పొరేట్ వైద్య సదుపాయాన్ని కేసీఆర్ సర్కారు కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంట జగ్గయ్య, టీబీజీకేఎస్ కేంద్ర నాయకులు బండి రమేశ్, పానగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్, నాయకులు రఫీక్ఖాన్, రాజునాయక్, బూరుగు సత్తయ్య, రాజేశ్వర్రెడ్డి, ఎల్లయ్య, సురేశ్గౌడ్, పెర్క సత్తయ్య, రవిగౌడ్, పెట్టం నరేశ్, కొండపర్తి శంకర్ తదితరులున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరుతూ నస్పూర్ మున్సిపాలిటీ పరిధి 6వ వార్డు ఆర్కే 8కాలనీ, భగత్సింగ్నగర్లో మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్రపాణి, వార్డు అధ్యక్షుడు గోపతి తిరుపతి, కార్యదర్శి సందనవేన మల్లేశ్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రాములు, రమేశ్, లచ్చన్న పాల్గొన్నారు.