NRI News | సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో “పాట షికారుకొచ్చింది” పుస్తక పరిచయ కార్యక్రమం ఆదివారం (19 మే, 2024)లో ఘనంగా జరిగింది. సింగపూర్లోని ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా `పాట షికారుకొచ్చింది` పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకూ దాదాపు 200 పైగా వేదికల మీద మాట్లాడినా కుటుంబ సమేతంగా ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం సింగపూర్లో మొదటిసారి కుదిరిందన్నారు. ఇంతకు ముందు ఎన్ని సార్లు ప్రయత్నించినా వీలు కాలేదని, సింగపూర్ సభ ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమ వ్యాఖ్యాత సుబ్బు పాలకుర్తి తన గురించి ఎంతో శోధించి పరిచయ వాక్యాలు వ్రాశారని ప్రశంసించారు. తన గురువు సీతారామ శాస్త్రి పాటలను, జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ `పాట షికారుకొచ్చింది` అనే పుస్తకం రాశానన్నారు.
ప్రతి పాట వెనుక ఉన్న కథను అందరికీ చేరవేయాలనే ఉద్దేశ్యంతో ప్రాణం పెట్టి వ్రాసిన పుస్తకం ఇది అని ఆకెళ్ల రాఘవేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్బంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబంధాన్ని, తనకు ఆయన అందించిన ప్రోత్సాహాన్ని ఆహూతులందరితోనూ పంచుకున్నారు. సింగపూర్లో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుందదన్నారు. ఈ కార్యక్రమ్ ముగించుకుని వెళుతుంటే పుట్టినింటిపై మమకారాన్ని దాచుకోలేని ఒక పెళ్ళికూతురు వెళ్ళలేక వెళ్ళలేక మెట్టినింటికి వెళుతున్నట్లనిపిస్తుందని అన్నారు. ఈ సంస్థ ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా తప్పక వస్తానని చెప్పారు. సింగపూర్ వాసుల ఆప్యాయత తనను కట్టిపడేసిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన `సిరివెన్నెల` అభిమానులందరికీ కృతజ్ఞతలు అని భావోద్వేగానికి లోనయ్యారు.
సుబ్బు వీ పాలకుర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళా సారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ సిరివెన్నెల జయంతి `మే 20వ తేదీకి` ఒక్కరోజు ముందు ఆయన జీవిత పుస్తకాన్ని సింగపూర్లో ఆకెళ్ళ రాఘవేంద్ర ఆవిష్కచడం చాలా ఆనందం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిరివెన్నెల స్మరించుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా మరొక్కసారి అందరికీ దక్కిందని చెప్పారు. తెలుగు అక్షరం ఉన్నంత వరకూ సిరివెన్నెల పాట తెలుగు వారి నోటివెంట వినబడుతూనే ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి రామాంజనేయులు చమిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల సహాయ సహకారాలు అందించారు. రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. 50 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా 1000 కి మందికి పైగా వీక్షించారు. సిరివెన్నెల అభిమానులు షర్మిల, కృష్ణ కాంతి, మాధవి, పణీష్ తమ పాటలు, కవితలు వినింపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమం చివర్లో ఆకెళ్ళ సిరివెన్నెల మాట్లాడుతూ వారికి వారి కుటుంభానికి సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని తలుచుకున్నారు, తన తండ్రికి తగ్గ తనయరాలుగా అందరి ప్రశంసలు పొందారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిదులందరికి విందు భోజన ఏర్పాట్లను రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పర్యవేక్షించారు.
https://www.youtube.com/live/5tOUHWGrcVs?si=XE_mD-gGaPXKAiz1