న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ పదవికి ఎంపిక విషయంలో సీజేఐ ఎన్వీ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు రేసు నుంచి తప్పుకున్నాయి. దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో కేంద్రం తనకు అందిన ఇద్దరి పేర్లను తొలుత ప్రధాని మోదీ చదవగానే.. ఆరు నెలల పదవీకాలం నియమాన్ని జస్టిస్ రమణ ముందుకు తేవడంతో వారి పేర్లను పరిశీలనకు తీసుకోలేదు. ఈ విషయాలను ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొన్నది.
ఎన్డీటీవీ కథనం ప్రకారం.. సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో సమావేశమయ్యారు. ఈ పదవికి పోటీలో ఉన్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసేందుకు సమావేశంలో చర్చించారు. తొలుత కేంద్రానికి అందిన జాబితాలోని పేర్లను మోదీ చదవడం ప్రారంభించగానే.. జస్టిస్ ఎన్వీ రమణ ఆరు నెలల పరిపాలనా కాలం నియమాన్ని పాటించాలని సూచించారు. దాంతో పరిశీలనకు వచ్చిన ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ, బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ ఆస్తానా పేర్లపై జస్టిస్ ఎన్వీ రమణ అభ్యంతరం తెలిపారు. వైసీ మోదీ ఈనెల 31 న, ఆస్తానా ఆగస్ట్ 31 న పదవీ విరమణ చేయనున్న దృష్ట్యా.. ఆరు నెలల పదవీ కాలం అనే నియమాన్ని పాటించాలని ఎన్వీ రమణ చెప్పడంతో వైసీ మోదీ, రాకేశ్ ఆస్తానా పేర్లను పక్కన పెట్టాల్సివచ్చింది.
సీజేఐ చర్చకు అధిర్ రంజన్ మద్దతు ఇచ్చారు. ముగ్గురు సభ్యుల ప్యానెల్లో ఇద్దరు వ్యక్తుల మద్దతుతో ఈ నియమాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు సీబీఐ డైరెక్టర్ పోస్ట్ కోసం ముగ్గురు పేర్లు షార్ట్లిస్టులో ఉన్నాయి. వీరు మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైస్వాల్, శాస్త్రా సీమా బల్ డైరెక్టర్ కేఆర్ చంద్ర, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌమూదీ. ఈ ముగ్గురులో సీనియారిటీ అధికంగా ఉండటంతో సుబోధ్ కుమార్ జైస్వాల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తున్నది.
సీబీఐ డెరెక్టర్ పదవికి ఎంపిక సమావేశం 4 నెలల క్రితం జరగాల్సి ఉంది. కరోనా వైరస్ ఉద్ధృతితోపాటు మరికొన్ని కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది. ఈ పదవికి మొత్తం 109 మంది పేర్ల జాబితా తయారవగా.. వారిలో నుంచి ఆరుగురి పేర్లను షార్ట్లిస్ట్ చేసినట్లు సమాచారం. సీబీఐ డైరెక్టర్ పదవి గత ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉన్నది. ఈ పదవికి ఐపీఎస్ అధికారుల సీనియర్ బ్యాచ్ నుంచి ఎంపిక చేస్తారు. ఈ పదవిలో రిషి కుమార్ శుక్లా ఫిబ్రవరి వరకు ఉన్నారు. ఆయన తర్వాత తాత్కాలిక అధిపతిగా ప్రవీణ్ సిన్హా ఉన్నారు.
అమరీందర్కు పక్కలో బళ్లెంలా సిద్దూ
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
‘హవానా సిండ్రోమ్’ : అమెరికాను కలవరపెడుతున్న మైక్రోవేవ్ దాడులు
కరోనా నియంత్రణకు కాక్టైల్ ఔషధాన్ని తీసుకొచ్చిన రోచె-సిప్లా
సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ పేరు కూడా..!
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..