ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నేతలపై 2013 లో సరిగ్గా ఇదే రోజున నక్సలైట్లు కాల్పులు జరిపారు. జిరామ్ వ్యాలీలో జరిగిన ఈ కాల్పుల్లో కాంగ్రెస్కు చెందిన దాదాపు 30 మంది నాయకులు చనిపోయారు.
ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పరివర్తన్ యాత్ర చేపట్టింది. సరిగ్గా ఇదే రోజున సుక్మాలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్ సుక్మా నుంచి జగదల్పూర్కు వెళ్తోంది. కాన్వాయ్లో 200 మంది నాయకులతో 25 వాహనాలు ఉన్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నంద్కుమార్ పటేల్, అతని కుమారుడు దినేష్ పటేల్, కవాసి లఖ్మా తమ సెక్యూరిటీ గార్డులతో ముందంజలో ఉన్నారు. మహేంద్ర కర్మ, మల్కిత్ సింగ్ గైడు కారు వారి వెనుక ఉన్నాయి. అప్పటి బస్తర్కు ఇన్చార్జి ఇంఛార్జి ఉదయ్ ముదలియార్ మరికొందరు నాయకులతో కలిసి వీరి వాహనాన్ని అనుసరిస్తున్నారు.
సాయంత్రం 4 గంటలకు కాన్వాయ్ జిరామ్ లోయ గుండా వెళ్తుండగా.. చెట్లను నరికి అడ్డంగా వేసి రోడ్డును మూసేసిన నక్సలైట్లు దాదాపు 200 మంది ఒక్కసారిగా కాంగ్రెస్ కాన్వాయిపై కాల్పులు జరుపడం ప్రారంభించారు. నక్సలైట్లు అన్ని వాహనాలపై కాల్పులు జరుపడంతో నంద్కుమార్ పటేల్, అతని కుమారుడు దినేష్ అక్కడికక్కడే మరణించారు. కార్లలో కొన ఊపిరితో వారిపై కూడా కాల్పులు జరిపి వారిని కూడా చంపేశారు. దాదాపు గంటన్నర పాటు కాల్పులు కొనసాగినట్లు అప్పటి ప్రత్యక్ష్య సాక్షలు తెలిపారు. మహేంద్ర కర్మను కొద్ది దూరం తీసుకెళ్లి హత్య చేశారు. ఈ దాడిలో దాదాపు 30 మంది చనిపోయారు.
బస్తర్ టైగర్ మహేంద్ర కర్మ. ‘సల్వా జుడుమ్’కు నాయకత్వం వహించడం వల్ల నక్సలైట్లు అతన్ని తమ అతిపెద్ద శత్రువుగా భావించి ఈ దారుణాని ఒడిగట్టినట్లుగా పోలీసులు అనుమానించారు. నక్సలైట్లు మహేంద్ర కర్మ శరీరంపై దాదాపు 100 బుల్లెట్లను కాల్చారు. 50 కి పైగా కత్తిపోట్లు పొడిచారు.
2020: అమెరికాలో పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించి నేటికి ఏడాది
2017: ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్కు గౌరవ డిగ్రీ అందజేసిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం
2008: కర్ణాటకలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ
2008 : మార్స్పై క్షేమంగా దిగిన నాసా ఫోనిక్స్ ల్యాండర్ రోవర్
2005: బాలీవుడ్ నటుడు, మాజీ ఎంపీ సునీల్ దత్ మరణం
2003: మొదటిసారి ప్రపంచ కప్ టెన్నిస్ టైటిల్ గెలుచుకున్న చిలీ
1995: మొదటిసారి ఒక జీవి డీఎన్ఏను డీకోడ్ చేయడంలో విజయం సాధించిన అమెరికన్ శాస్త్రవేత్తలు
1985: బంగ్లాదేశ్లో తుఫాను కారణంగా దాదాపు 10 వేల మంది మరణం
1919: జావాలో కెలాట్ అగ్నిపర్వతం పేలి దాదాపు 16 వేల మందికి పైగా మరణం
1915 : గుజరాత్లో సబర్మతి ఆశ్రమాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ
‘హవానా సిండ్రోమ్’ : అమెరికాను కలవరపెడుతున్న మైక్రోవేవ్ దాడులు
కరోనా నియంత్రణకు కాక్టైల్ ఔషధాన్ని తీసుకొచ్చిన రోచె-సిప్లా
సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ పేరు కూడా..!
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..