హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నాయకుడు కడారి అంజయ్య కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బీజేపీ నుంచి సాగర్లో పోటీ చేయాలని అంజయ్య నిర్ణయించుకున్నప్పటికీ.. పార్టీ అగ్ర నాయకత్వం.. పానుగోతు రవికుమార్కు టికెట్ కేటాయించింది.
దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న అంజయ్య.. బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ను అంజయ్య కలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కడారి అంజయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..