కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండో విడుత ఎన్నికలు మార్చి 31న జరిగిన విషయం విదితమే. రెండో విడుతలో భాగంగా నాలుగు జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మొత్తంగా 86.11 శాతం పోలింగ్ నమోదు కాగా, నందిగ్రామ్ నియోజవకర్గంలో 88.01 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో అరిజ్ ఆఫ్తబ్ తెలిపారు. మొత్తం 75.94 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగు జిల్లాల వారిగా చూస్తే.. పుర్బా మేదినిపూర్లో 87.42 శాతం, బంకురాలో 86.98 శాతం, సౌత్ 24 పరగణలో 86.74 శౄతం, పశ్చిం మేదినిపూర్లో 83.84 శాతం పోలింగ్ నమోదైంది.
నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నుంచి సువేంద్రు అధికారి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య రసవత్తరమైన పోటీ ఉంది. అయితే ఈ ఎన్నికలో తామంటే తామె గెలుస్తామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నందిగ్రామ్లో గెలుపు ఎవరిదో తెలియాలి అంటే మే 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.