కోల్కతా : పశ్చిమ బెంగాల్లో భారీగా పెట్రోల్ బాంబులు లభ్యమయ్యాయి. దక్షిణ 24 పరగణ జిల్లాలోని బరైపూర్లోని ఓ చెట్ల పొదల్లో నుంచి 41 పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
మార్చి 31వ తేదీన బర్దమాన్ జిల్లాలో 21 పెట్రోల్ బాంబులను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఈ బాంబులను నిల్వ చేసినట్లు పోలీసులు తెలిపారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు సంఘ విద్రోహ శక్తులు కుట్రల చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మొదటి, రెండో దశ ఎన్నికలు ముగిసిన విషయం విదితమే. మరో ఆరు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది.