హైదరాబాద్: కుమ్రం భీం, మంచిర్యాల జిల్లాల నుంచి సికింద్రాబాద్కు రాకపోకలు సాగించేందుకు మరో రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్నగర్ (ఇంటర్సిటీ) రైలు నేడు తిరిగి ప్రారంభం కానుంది. ప్రతిరోజు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 4.50 గంటలకు బయలుదేరి ఉదయం 9.12 గంటలకు మంచిర్యాలకు, 10.55 గంటలకు కాగజ్నగర్కు చేరుకుంటుంది. తిరిగి 11.55 గంటలకు కాగజ్నగర్లో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.56 గంటలకు మంచిర్యాలకు, సికింద్రాబాద్కు సాయంత్రం 5.55 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు రైల్వే సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..