హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్ కోటాలో అజారుద్దీన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, వివేక్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.