రాయ్పూర్ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల మధ్య.. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సిన్ డ్రైవ్లో జర్నలిస్టులను చేర్చాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. డ్రైవ్లో విలేకరులకు టీకాలు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్కు లేఖ రాసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్డియో తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్440కే కొవిడ్ జాతి కేసులు ఎనిమిది వెలుగు చూశాయని తెలిపారు. గురువారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో సుమారు మూడువేల ఇటెన్సివ్ కేర్ యూనిట్లు, ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉంచామన్నారు. రోజుకు రెండు లక్షల టీకాలు వేసే లక్ష్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం 28,987 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు వైరస్ నుంచి 3,20,613 మంది కోలుకోగా.. 4,204 మంది మృత్యువాతపడ్డారు.