కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర హింసల మధ్య ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అమెరికా రాయబారి జల్మయ్ ఖలీల్జాద్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఈ ప్రతినిధి బృందం వైట్ హౌస్ సందేశాన్ని అష్రఫ్ ఘనీకి అందించింది. అలాగే, ఆర్థిక రంగంలో నిరంతరం సహాయం చేయడానికి హామీ ఇచ్చింది. ఈ సమయంలో తాలిబాన్ ఉగ్రవాదులతో కొనసాగుతున్న శాంతి చర్చలు కూడా వివిధ వేదికలపై కొనసాగాయి. ఆఫ్ఘనిస్తాన్లో హింస తీవ్ర స్థాయిలో ఉన్నద. రెండు రోజుల్లో 119 మందికి పైగా మరణించారు. వీరిలో 50 మంది ఆఫ్ఘన్ సైనికులు మరణించడం లేదా తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో 181 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని 34 ప్రావిన్సులకుగాను 26 లలో తీవ్ర యుద్ధం జరుగుతున్నది. పశ్చిమ ప్రావిన్స్ ఘోర్ లోని షారక్, మరొక జిల్లాను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబాన్లు వీలైనన్ని జిల్లాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సమాధానంగా ఆఫ్ఘన్ ఆర్మీతోపాటు వైమానిక దాడులు జరుపుతున్నది. కాగా, బాల్ఖ్లో జరిగిన కారు బాంబు దాడిలో నలుగురు మరణించారు. 50 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ మే 1 నుంచి ప్రారంభమైంది. మొత్తం సైన్యం ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 11 లోగా పూర్తికానున్నదని తాలిబాన్లతో చేసుకున్న ఒప్పందంలో అమెరికా ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మోదీకి బుఖారీ వినతి : జామా మసీదు మరమ్మతుకు సాయం చేయండి
కొత్త సేవలు : స్పీడ్ పోస్ట్లో అస్తికల నిమజ్జనం
ఇమ్యూనిటీ బూస్టర్ : పనస గింజల్లో దాగి ఉన్న ఆరోగ్యం
ఫుల్ ట్రోలింగ్ : తొలి డోసు తీసుకున్న ములాయం
ఆధిపత్యం వద్దు : చైనా విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆందోళన
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..