అమరావతి : తిరుపతిలోని కర్నాల వీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి జనంపైకి దూసుకు వెళ్లింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఇదే ఘటనలో మరొకరు గాయపడ్డారు. ఘటనలో బస్సు దూసుకు వెళ్లడంతో మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనతో స్థానికులతో పాటు బస్సులో ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. బస్సులో ఉన్న వారికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవికూడా చదవండి..