డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని సుర్సింగ్ ధార్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు. ఆ తర్వాత అధికారులు కళాశాల హాస్టల్ను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. 200 మంది విద్యార్థుల నమూనాలను పరీక్షలకు పంపగా.. 93 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. మరికొందరి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉన్నది. నెగెటివ్ వచ్చిన 65 మంది విద్యార్థులకు ఇంటికి పంపించి వేశారు. జిల్లా మెజిస్ట్రేట్ టెహ్రీ ఆదేశాల మేరకు హాస్టల్ను కంటైనేషన్ జోన్గా ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్లో నిన్న 5,084 కరోనా పాజిటివ్ కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 33,330కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరో వైపు ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపడుతోంది. కార్యాలయాల్లో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 28వ తేదీ వరకు అన్ని కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవలు కొనసాగుతాయని, మిగతా అధికారులు సైతం అందరూ అందుబాటులో ఉండాలని సూచించింది.
ఇవికూడా చదవండి..