కొత్తిమీర, పుదీనా.. ఈ రెండు ఆకుపచ్చ ఔషధాలను మనం నిత్యం వాడుతుంటాం. వీటిని కలిపి చేసుకునే పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ పచ్చడిని మనస్ఫూర్తిగా ఆరగిస్తుంటారు. అల్పాహారంలోకే కాకుండా భోజనంలోకి కూడా తీసుకోవచ్చు. తక్కువ ఆకలిగా ఉన్నా, అజీర్తి సమస్యలు ఉన్నా భోజనంలోకి పుదీనా-కొత్తిమీరతో చేసిన పచ్చడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ప్రతి భారతీయ ఇంటిలో భాగమైన ఈ పచ్చడిని రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
మన వాళ్లలో జీర్ణక్రియ సమస్యలు చాలా సాధారణం. కాబట్టి మనం కొత్తిమీర-పుదీనా పచ్చడిని తయారుచేసేటప్పుడు నిమ్మకాయ, నల్ల ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, అస్ఫోటిడా, అల్లం, వెల్లుల్లిని కలిపడం మరిచిపోవద్దు. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా భోజనానికి మెరుగైన రుచిని ఇస్తుంది.
కొత్తిమీర మధుమేహం ఉన్నవారికి ఇన్సులిన్ స్రావాన్ని ఉత్తేజపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో గ్రేట్గా సహాయపడుతుంది. నిత్యం ఈ పచ్చడిని తినడం వల్ల డయాబెటిస్ను నియంత్రణలో పెట్టుకునేందుకు వీలుంటుంది.
కడుపుకు ఓదార్పునిస్తుంది. కొత్తిమీర-పుదీనాతో చేసిన పచ్చడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం మొత్తం మంటను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
ఆకలిగా అనిపించకపోవడం బలహీనత, అలసటకు దారితీస్తుంది. అందుకని రెగ్యులర్ భోజనంలో ఈ చిటికెడు పచ్చడిని జోడించడం వల్ల ఆకలి పెరుగుతుంది. రుచిని కూడా మెరుగుపరుస్తుంది.
పుదీనా ఆకులు చాలా రిఫ్రెష్ సుగంధాన్ని కలిగి ఉంటాయి. ఇవి వికారం నుంచి బయటపడేందుకు సహాయపడతాయి, తద్వారా దీనిని తీసుకున్న వెంటనే మంచి అనుభూతి కలుగుతుంది.
ఆకుపచ్చ కొత్తిమీరలో యాంటీ ఫంగల్, క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి పచ్చడిని తయారుచేయడం, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మచ్చలు, మొటిమల సమస్యలను నివారించవచ్చు. ఇది శరీరంలోని విషాలను బయటకు పంపడంలో గ్రేట్గా సాయపడుతుంది. మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
కొత్తమీర-పుదీన పచ్చడిని నిత్యం తీసుకునే వారిలో ఐరన్ లోపం కారణంగా వచ్చే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ రెండింటిలో తగినంత ఐరన్ కంటెంట్ ఉండి మనకు ఎంతో ఆరోగ్యాన్ని కల్గిస్తుంది.
ఈ టెక్నాలజీతో ఎన్-95 మాస్క్లు, పీపీఈ కిట్ల రీయూజ్ సాధ్యం..!
వండర్ వుమెన్ : తలపై సామానుతో నీటిలో బైకుపై.. వీడియో వైరల్
సింహాలతో కొట్లాడి పిల్లను దక్కించుకున్న బర్రె.. వీడియో వైరల్
చంపత్రాయ్ను తొలగించాల్సిందే : స్వామి స్వరూపానంద సరస్వతి
బ్లాక్ గేమ్స్ రొచ్చు : హనీట్రాప్లో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు
ఫైనల్కు ముందు వివాదం : బయో బబుల్ను వీడిన కివీస్ ఆటగాళ్లు
గంగానదిలో పెట్టె.. పెట్టెలో దేవతల మధ్య చిన్నారి..
డబ్ల్యూటీసీ ఫైనల్ : ఒక్క మ్యాచ్తో విజేతను నిర్ణయించడం సరికాదు : సచిన్
చరిత్రలో ఈరోజు : అంతరిక్షంలోకి వాలెంటినా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..