లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా – లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎక్స్ప్రెస్వేలోని నాగ్లా ఖాంగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు.. తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన ప్రైవేటు డబుల్ డెక్కర్ బస్సు ఆగ్రా నుంచి లక్నో వెళ్తుండగా బ్రేక్డౌనైంది.
ఈ క్రమంలో బస్సును రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్, కండక్టర్ రిపేర్ చేస్తున్న సమయంలో ఈ క్రమంలో అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. క్షతగాత్రులను ఎటావా జిల్లాలోని మెడికల్ కాలేజీకి తరలించారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సీఎం ఆదేశించారని సీఎంఓ తెలిపింది.