గాలె: ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియా తన ఫస్ట్ వికెట్ను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న జైస్వాల్.. 37 బంతుల్లో 32 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. బ్యాటర్ కేఎల్ రాహుల్ మిడ్ ఆన్ దిశగా ఓ బంతిని కొట్టి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. బౌలర్ కిషార నువంత తన కుడి వైపు జంప్ చేసి.. పరుగును ఆపే ప్రయత్నం చేశాడు. నువంత తన జంప్ సమయంలో జైశ్వాల్ కాళ్లను తాకాడు. దీంతో జైస్వాల్ గ్రౌండ్పై పడిపోయాడు. దీన్ని గమనించకుండానే రాహుల్ పరుగు కోసం ముందుకు కదిలాడు. చివరకు నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు ఇద్దరు బ్యాటర్లు ఉండిపోయారు. అయితే తొలుత తన బ్యాట్ను రాహుల్ ముందుగా గ్రౌండ్ చేయడం వల్ల అతను నాటౌట్గా నిలిచాడు. జైస్వాల్ స్ట్రయికర్ దిశగా వెళ్లాలనుకున్నా.. చివరకు అక్కడే ఉండిపోయాడు. దీంతో అతను ఔటయ్యాడు. ప్రస్తుతం ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో తాజా సమాచారం ప్రకారం వికెట్ నష్టానికి 73 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్, పడిక్కల్ క్రీజ్లో ఉన్నారు.
Yashasvi jaiswal got run-out on 37 🥲
– who’s fault was that ? pic.twitter.com/zLS0Eet9zQ
— Wade (@WadeCricket) August 15, 2026