న్యూఢిల్లీ : దేశంలో ఇంధర ధరల పెంపు కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు ధరలు పైకి కదిలాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మరింత పైకి వెళ్తున్నాయి. తాజాగా మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 31 పైసలు వరకు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.81, డీజిల్ లీటర్ రూ.89.18కు పెరిగింది. గత నెల నుంచి ఇప్పటి వరకు 33 సార్లు లీటర్ పెట్రోల్పై రూ.8.49, డీజిల్పై రూ.8.39 పెరిగింది.
మరో వైపు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్ రూ.105 వైపు పరుగులు పెడుతున్నది. ప్రస్తుతం లీటర్ ధర రూ.104.90 పలుకుతోంది. మరో వైపు రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.04, డీజిల్ రూ.102.42కు పెరిగింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో సామాన్యులు బంకులకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ను దాటగా.. డీజిల్ ధర రూ.100 వైపు పరుగులు పెడుతున్నది.
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు
ఢిల్లీలో పెట్రోల్ రూ.98.81.. డీజిల్ రూ.89.18
ముంబైలో పెట్రోల్ రూ.104.90.. డీజిల్ రూ.96.72
హైదరాబాద్లో పెట్రోల్ రూ.102.69.. డీజిల్ రూ.97.20
చెన్నైలో పెట్రోల్ రూ.99.80.. డీజిల్ రూ.93.72
కోల్కతాలో పెట్రోల్ రూ.98.64, డీజిల్ రూ.92.03
విజయవాడలో పెట్రోల్ రూ.104.58, డీజిల్ రూ.98.52
భోపాల్లో పెట్రోల్ రూ.107.07.. డీజిల్ రూ.97.93
బెంగళూరులో పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.94.54
పాట్నాలో పెట్రోల్ రూ.100.81.. డీజిల్ రూ.94.52
చండీగఢ్లో పెట్రోల్ రూ.95.02, డీజిల్ రూ.88.81
లక్నోలో పెట్రోల్ రూ.95.57, డీజిల్ రూ.89.59
రాంచీలో పెట్రోల్ రూ.94.35, డీజిల్ రూ.94.12